ఒకరోజు ఒకామె వచ్చి భగవాన్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు
'మనసు పరిపరి విధాల పోతోంది. ఏం చెయ్యను స్వామీ?' అని అడిగింది.
'ఒకే విధంగా పోయేట్టు చూడు ' అన్నారు.
ఆమె వెళ్ళాక రంగన్ అనే భక్తుడు అడిగాడు
'భగవాన్! అది చాతనైతే, ఇంకేం కావాలి? జ్ఞానమే కదా?'
'మరి ఏం చెయ్యను? రాగానే తాము జ్ఞానులై పోవాలని
ఆశపడతారు మనుషులు. చాలా సులభమనుకుంటారు.
దాంట్లో వుండే కష్టాన్ని గుర్తించరు ' అన్నారు భగవాన్.
ఒకసారి ఓ భక్తుడు భగవాన్ ని అడిగాడు.
'ఓ జ్ఞాని ఇంకో జ్ఞానిని గుర్తించగలడా?'
దానికి భగవాన్
'జ్ఞానికి గుర్తించటానికి ఏముంటుంది?
తాను, తక్కిందీ అంతా ఒకటే ఆత్మ కదా జ్ఞానికి!' అన్నారు.
'ఓ జ్ఞాని ఇంకో జ్ఞానిని గుర్తించగలడా?'
దానికి భగవాన్
'జ్ఞానికి గుర్తించటానికి ఏముంటుంది?
తాను, తక్కిందీ అంతా ఒకటే ఆత్మ కదా జ్ఞానికి!' అన్నారు.
ఒకరోజు సూటూ బూటూ వేసుకున్న పాశ్చాత్యుడు బూట్లు విడువకుండానే
భగవాన్ వున్న హాల్లోకి దర్జాగా వచ్చి
'భగవాన్! మీరు దేవుణ్ణి చూశారా ?' అని అడిగాడు.
భగవాన్ ఏమీ తెలీనివాని వలె, 'దేవుడా? ఎవరాయన ? ' అని అడిగారు.
అతను తెల్లబోయి నుంచున్నాడు. కొంచెం సేపుండి అతను
'భగవాన్ ! మీ ఫోటో నేను తీసుకోవచ్చునా ?' అని అడిగాడు.
సరేనన్నారు భగవాన్. ఆ వచ్చిన అతను ఒక snap తీసుకొని వెళ్ళాడు.
తరవాత భగవాన్ అన్నారు. 'వివేకానంద, రామకృష్ణుని 'దేవుణ్ణి చూశావా ' అని అడిగింది చదివి వుంటాడు. అదే అస్త్రం ప్రయోగించాడు. యీ వూరికి టిక్కెట్టుతో దేవుణ్ణి కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఏం చేస్తాం ? '
భగవాన్ వున్న హాల్లోకి దర్జాగా వచ్చి
'భగవాన్! మీరు దేవుణ్ణి చూశారా ?' అని అడిగాడు.
భగవాన్ ఏమీ తెలీనివాని వలె, 'దేవుడా? ఎవరాయన ? ' అని అడిగారు.
అతను తెల్లబోయి నుంచున్నాడు. కొంచెం సేపుండి అతను
'భగవాన్ ! మీ ఫోటో నేను తీసుకోవచ్చునా ?' అని అడిగాడు.
సరేనన్నారు భగవాన్. ఆ వచ్చిన అతను ఒక snap తీసుకొని వెళ్ళాడు.
తరవాత భగవాన్ అన్నారు. 'వివేకానంద, రామకృష్ణుని 'దేవుణ్ణి చూశావా ' అని అడిగింది చదివి వుంటాడు. అదే అస్త్రం ప్రయోగించాడు. యీ వూరికి టిక్కెట్టుతో దేవుణ్ణి కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఏం చేస్తాం ? '
ఒకరోజు భగవాన్ భోజనానికి లేవబోతున్నారు. అప్పుడు ఒకరు -
'చాతుర్వర్ణం మయాసృష్టం
గుణకర్మ విభాగినః అని అంటారే!
అంటే గుణమునుబట్టి కదా వర్ణాన్ని తీర్మానించవలసింది? ' అని ప్రశ్న వేశారు. భ
గవాన్ కి తెలీదా? దేనికి ఆ ప్రశ్న lead చెయ్యబోతోందో.
'యీ ప్రశ్నలు తగూలూ తెచ్చిపెట్టడానికే కద! యీ దురుద్దేశాల వల్లనే అనర్థాలు పుట్టేది. నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు తెలుసుకోటానికి కులమూ, వర్ణమూ అడ్డం వొచ్చాయా? తానెవరో తెలీదు, నీకేం కావాలో తెలీదు, లోకానికేం కావాలో తెలుస్తుందా ? మీరా లోకాన్ని ఉద్దరించేవారు? ' అని మందలించారు.
'చాతుర్వర్ణం మయాసృష్టం
గుణకర్మ విభాగినః అని అంటారే!
అంటే గుణమునుబట్టి కదా వర్ణాన్ని తీర్మానించవలసింది? ' అని ప్రశ్న వేశారు. భ
గవాన్ కి తెలీదా? దేనికి ఆ ప్రశ్న lead చెయ్యబోతోందో.
'యీ ప్రశ్నలు తగూలూ తెచ్చిపెట్టడానికే కద! యీ దురుద్దేశాల వల్లనే అనర్థాలు పుట్టేది. నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు తెలుసుకోటానికి కులమూ, వర్ణమూ అడ్డం వొచ్చాయా? తానెవరో తెలీదు, నీకేం కావాలో తెలీదు, లోకానికేం కావాలో తెలుస్తుందా ? మీరా లోకాన్ని ఉద్దరించేవారు? ' అని మందలించారు.
ఆశ్రమం పైన ఒక పెద్ద ఫిర్యాదు వుంటో వుండేది, గొప్పవారిని ఎక్కువగా చూస్తారని, ఒకాయన యీ హెచ్చుతగ్గుల సంగతి భగవాన్ తో చెప్పుకుంటో వుండగా భగవాన్ కి మధ్యాహ్నం కాఫీ వచ్చింది. మధ్యాహ్నాలు భగవాన్ హాలులో అందరి మధ్యా కూచుని వుండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి
'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.
'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.
ఆయనకి భగవాన్ ఇచ్చింది కాఫీ కానేకాదు, ఏదో ఔషధులు వేసి కాచిన కషాయం. అది భగవాన్ తాగవలసిందే కాని తదితరులకు దుసాధ్యం. తీరా తీసున్నాడు . వద్దనడానికి వీల్లేదు. అందరి మధ్య వున్నాడు. పారపొయ్యటానికి వీల్లేదు. భగవాన్ ప్రసాదం, ఆయన చేత్తో ఇచ్చింది. ఆనాటి ఆయన యాతన ఆ భగవాన్ కే ఎరుక.
ఒకసారి ఒక కుటుంబంతో ఓరుగంటి వెంకటకృష్ణయ్య అనే భక్తుడు రాత్రి గిరి (అరుణాచలం కొండ) ప్రదక్షిణం చేస్తున్నారు. ఈశాన్య మఠం వైపు మలుపు తిరుగుతుండగా మాకు ఓ లారీ ఎదురువచ్చింది. ఆ లారీవాళ్ళు 'జాగ్రత్తగా వెళ్ళండి , చిరుతపులుల అరుపులు వినబడుతో వున్నాయి. ' అన్నారు.
ఏం చెయ్యం? వెనక్కి వెళ్ళమా మళ్ళీ అన్ని మైళ్ళు? అడవిలో ఆగితే, అవి అక్కడికి రావా, మమ్మల్ని పసి గట్టి! తప్పదు ముందుకు పోవాలి. 'రమణా, జయ రమణా ' అని పాడుకుంటో వెళ్ళాం. ఊరు తగిలింది తరువాత చెప్పాడు మాతో వున్న కాలేజి అబ్బాయి, రోడ్డుకు ఇటు ఒక చిరుత, అటు ఒక చిరుత వున్నాయనీ, తాను చూసి కిక్కురు మనకుండా నడిచాననీ.
ఏం చెయ్యం? వెనక్కి వెళ్ళమా మళ్ళీ అన్ని మైళ్ళు? అడవిలో ఆగితే, అవి అక్కడికి రావా, మమ్మల్ని పసి గట్టి! తప్పదు ముందుకు పోవాలి. 'రమణా, జయ రమణా ' అని పాడుకుంటో వెళ్ళాం. ఊరు తగిలింది తరువాత చెప్పాడు మాతో వున్న కాలేజి అబ్బాయి, రోడ్డుకు ఇటు ఒక చిరుత, అటు ఒక చిరుత వున్నాయనీ, తాను చూసి కిక్కురు మనకుండా నడిచాననీ.
ఒకసారి భగవాన్ తో వొక భక్తుడు
'భగవాన్ ! ఇదివరకుమల్లే మీ రూపం
నా కళ్ళ ఎదుట నిలవటం లేదు. ఏం చెయ్యను? ' అని అడిగాడు.
'నామం జ్ఞాపకం వుంది కదా!
రూపం కన్నా నామం పై మెట్టు. నామమూ తరువాత పోతుంది.
అందాకా అది చాలు ' అన్నారు.
'భగవాన్ ! ఇదివరకుమల్లే మీ రూపం
నా కళ్ళ ఎదుట నిలవటం లేదు. ఏం చెయ్యను? ' అని అడిగాడు.
'నామం జ్ఞాపకం వుంది కదా!
రూపం కన్నా నామం పై మెట్టు. నామమూ తరువాత పోతుంది.
అందాకా అది చాలు ' అన్నారు.
భగవాన్ చనిపోవడమనే Shock ని నేను భరించగలనా అని బాధ పడేదాన్ని చాలాసార్లు. కాని సరిగ్గా ఆ సమయానికి నేను అరుణాచలంలో వుండకపోవటం సంభవించింది. ఆయన మరణవార్తని విన్నప్పుడు నాలో ఏ చలనమూ కలగలేదు. నా indifference ని చూసి నాకే ఆశ్చర్యమేసింది. కాని వెంటనే ఇది ఆయన నామీద చూపించిన కరుణ అని తెలుసుకున్నాను. నేను మద్రాసులో వుండగా, నాన్న దగ్గిర్నించి ఉత్తరం వొచ్చింది - భగవాన్ సమాధి దగ్గిర, అసలు భగవాన్ జీవించి వునప్పటి కన్నా ఎక్కువ spiritual potency ని feel అవుతున్నానని.
నేను ఆశ్రమానికి తిరిగి వొచ్చినప్పుడు ఆశ్రమమంతా ఎడారి లాగుంది. వెంటనే భగవాన్ presence ని feel అయ్యాను. భగవాన్ కంటికి కనపడనంత మాత్రాన యీ భక్తులందరూ ఎందుకు ఆశ్రమాన్ని వొదిలిపోతున్నారా అని ఆశ్చర్యమేసింది నాకు. సమాధి దగ్గిర కళ్ళు మూసుకుని కూచోగానే భగవాన్ నవ్వుతున్న మొహం ప్రత్యక్షమయేది. కాని ఎంత స్పష్టంగా భగవాన్ని feel అవుతున్నా నా కళ్ళు ఆయన భౌతిక శరీరంకోసం వెతికేవి.
నేను ఆశ్రమానికి తిరిగి వొచ్చినప్పుడు ఆశ్రమమంతా ఎడారి లాగుంది. వెంటనే భగవాన్ presence ని feel అయ్యాను. భగవాన్ కంటికి కనపడనంత మాత్రాన యీ భక్తులందరూ ఎందుకు ఆశ్రమాన్ని వొదిలిపోతున్నారా అని ఆశ్చర్యమేసింది నాకు. సమాధి దగ్గిర కళ్ళు మూసుకుని కూచోగానే భగవాన్ నవ్వుతున్న మొహం ప్రత్యక్షమయేది. కాని ఎంత స్పష్టంగా భగవాన్ని feel అవుతున్నా నా కళ్ళు ఆయన భౌతిక శరీరంకోసం వెతికేవి.
I
యీ జగత్తుకీ జీవితానికీ ఓ అర్థం వుంటే, వీటి వెనక ఓ సత్యం వుంటే, పరస్పర విరుద్దమైన యీ విలువలకీ ఓ సమన్వయముంటే, దాన్ని తెలుసుకునే మార్గం లేదనీ, మానవుడి మనసుకి అంతశక్తి లేదు గనక,ఎంత తరిచి చూసినా, అది ఓ గుడ్డి వలయంలో తిరగడం తప్ప, ఇంకేమీ సాధింపలేదనీ నిశ్చయించుకున్నాను. కాని ఎప్పుడూ అన్వేషించడం మాత్రం మానుకోలేదు. ఎంత అర్థం లేకపోయినా సత్యాన్వేషణ అనేది నా జీవితానికి ఓ ప్రధాన లక్షణమై పోయింది. ఏదో నా మనసునీ ఆలోచనలనీ మించిన విశ్వాసముండేది, నాకు దొరకనిదేదో సొల్యూషన్ వుందనీ, యీ లోకమూ జీవితమూ అర్థం విహీనం కావనీ, యీ అయోమయ స్థితిలోనే సగంపైగా నా జీవితం గడిచింది. అట్లాంటి సమయంలో దీక్షితులుగారు వొచ్చి నన్ను తనతో షికారుగా రమణాశ్రమానికి తీసుకొచ్చారు 1936లో.II
తోవలో భగవాన్ కోసం పళ్ళు కొనమంటే కొననన్నాను. ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. భగవాన్ ముందు నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం నాకు బాధగా వుంది. వొచ్చినప్పటినించి ఎప్పుడు పోదామా అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ అసహ్యం పుడుతోంది. 'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి ?'
ఆ రోజు భగవాన్ కొండమీదికి వెళ్ళి తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి భగవాన్ వొస్తున్నారు. అందరూ పక్కకి తప్పుకొంటున్నారు. నేనే కదలలేదు, 'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. భగవాన్ సమీపించేటప్పటికి దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. భగవాన్ నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, వెనక్కి తిరిగి నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, ఇప్పుడు తలుచుకుంటే, ఆ నిమిషం నించే నన్ను జయించేసుకున్నారు భగవాన్ అనిపిస్తుంది.
III
పాత భక్తులూ, ఘరానా వాళ్ళూ భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు. నేను చిట్ట చివర కూచుని ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని. ఒకసారి భగవాన్ తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు, అందరూ లేచిపోయినా కదలక కూచున్న నన్ను చూపి,'ఎందుకు అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. అది నా కర్థం కాలేదు. నాకేం కావాలి? ఆధ్యాత్మికోన్నతి. ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? అనుకుని మాట్లాడకుండా వూరుకున్నాను. హాల్లోకి భగవాన్ వొస్తున్నపుడు సౌరీస్ దగ్గిర ఆగి చిరునవ్వుతో కొంతసేపు చీసి వెళ్ళేవారు. నేను బలవంతంగా హాల్లో కూచునేవాణ్ణి.
మళ్ళీ ఇంకోసారి అడిగారు దగ్గిరున్న వాళ్ళని,
'ఏం కావాలి? ఎందుకట్లా కూచుంటాడు ?' అని.
అప్పుడూ నేను మాట్లాడలేదు. 'ఏం భగవాన్ కి తెలీదా? '.
ఇప్పుడు తెలుస్తోంది భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? తనకి తాను సాధించుకోవాలి కాని '
IV
వొయ్యి చచ్చిపోయిన తొందరలోనే అరుణాచలం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఆనాడు మాకు మిత్రులు లేరు , ఆదాయం లేదు, ఒక్క భగవాన్ తప్ప ఎవరూ కనిపించలేదు. భగవాన్ కి కూడా చాలా జబ్బుగా వుంది . బతకరంటున్నారు. 1950 మొదట్లో వొచ్చి, ఓ ఇల్లూ పాకా అద్దెకి తీసుకుని వున్నాం. భగవాన్ అంత జబ్బులోనూ , ఎంతో ఆదరంగా చూశారు మా వంక, మా రాకకే ఎదురుచూస్తున్నట్లు. త్వరలోనే భగవాన్ అస్తమించారు. మేం ఆయన ముందు చావాలని వొస్తే, ఆయనే మా ముందు వెళ్ళిపోయారు. భక్తులందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమం , మేమూ మాత్రమే మిగిలాం. భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ మమ్మల్నిఆదుకుని, అర్థంగాని ధైర్యమిచ్చి రక్షించారు. భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే వుంటానన్నాడు.నా ఆరోగ్యమూ సన్నగిల్లుతోంది. చివరి దశను సమీపిస్తున్నాను.
ఇప్పటికీ నాకు దేవుడిలోగాని, కర్మలోగాని, చావు తరవాత బతుకులోగాని విశ్వాసం లేదు. ఏదన్నా చేస్తే భగవాన్ ఒక్కరే చెయ్యగలరని విశ్వాసం మాత్రం వుంది.
[కుదిరితే యింకెప్పుడైనా వివరంగా ' రమణాశ్రమంలో భగవాన్ తో చలం ' ]
ఒక పాశ్చత్య భక్తుడు అరుణాచల పర్వతాన్ని అడ్డదారిని ఎక్కి వెళ్ళాడు. వెంట ఎవరినీ తీసుకువెళ్ళలేదు. ప్రొద్దుటనగా వెళ్ళిన వాడు చీకటి పడినా రాలేదు. అతనికోసం ఆశ్రమంలోని వారంతా ఆరాటపడుతున్నారు. భగవాన్ కూడా దూరదర్శిని ( బైనాక్యులర్స్ ) తో కొండకేసి చూస్తున్నారు. అతగాడి జాడలేదు. రాత్రి పొద్దుపోయినతరువాత అలసి సొలసి వచ్చాడు.
వచ్చి, ఒకచోట అలసటతో చతికిలబడ్డాడు. అక్కడికి కొంతమంది భక్తులు చేరారు. భగవాన్ కూడా వెళ్ళారు. 'ఇంత ఆలస్యంగా వచ్చారేమి? ' అని అడిగారు భగవాన్. ఆయన గుడ్లు మిటకరించి చూస్తూ
'భగవాన్, అదేమిటీ, మీరేకదా నేను తోవ తప్పి ఆదుర్దాపడుతుంటే కనపడి
ఆ అగాధాలను దాటించి తీసుకువచ్చారు? ' అన్నాడు.
వచ్చి, ఒకచోట అలసటతో చతికిలబడ్డాడు. అక్కడికి కొంతమంది భక్తులు చేరారు. భగవాన్ కూడా వెళ్ళారు. 'ఇంత ఆలస్యంగా వచ్చారేమి? ' అని అడిగారు భగవాన్. ఆయన గుడ్లు మిటకరించి చూస్తూ
'భగవాన్, అదేమిటీ, మీరేకదా నేను తోవ తప్పి ఆదుర్దాపడుతుంటే కనపడి
ఆ అగాధాలను దాటించి తీసుకువచ్చారు? ' అన్నాడు.
సుందరేశయ్యర్ భగవాన్ భక్తుడు. అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. భరించలేకపోయాడు. ఆత్మహత్యకు సిద్దపడ్డాడు. సిద్దమై కడసారిగా భగవాన్ దర్శనానికివెళ్లాడు. భగవాన్ అప్పుడు విస్తళ్ళు కుడుతున్నారు.
సుందరేశయ్యర్ ఏమీ అడక్కుండానే
'చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో! అడవికి వెళ్ళాలి. ఆకులు ఏరి తేవాలి. వాటిని ఎండబెట్టాలి. పుల్లలు తేవాలి. వాటిని సన్నగా చీల్చాలి. అప్పుడీ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టు గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతలపారేస్తామా? అదెందుచేత కుట్టబడిందో ఆ పని అయిన తరవాతగాని పారేయం. అనగా, దాంట్లో భోంచేసింతరువాతగాని పారేయం ' అన్నారు భగవాన్.
సుందరేశయ్యర్ ఏమీ అడక్కుండానే
'చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో! అడవికి వెళ్ళాలి. ఆకులు ఏరి తేవాలి. వాటిని ఎండబెట్టాలి. పుల్లలు తేవాలి. వాటిని సన్నగా చీల్చాలి. అప్పుడీ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టు గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతలపారేస్తామా? అదెందుచేత కుట్టబడిందో ఆ పని అయిన తరవాతగాని పారేయం. అనగా, దాంట్లో భోంచేసింతరువాతగాని పారేయం ' అన్నారు భగవాన్.
ఆంగ్ల రచయితలలో సోమర్సె ట్ మాం ( Somerset Maugham ) అగ్రశ్రేణికి చెందినవాడు. యీయన రాసిన కథలు ప్రపంచంలోని అనేక భాషలలోనికి అనువదించబడ్డాయి. 1936 లో భారతదేశం వచ్చాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షులవారిని దర్శించాలని తిరువన్నామలై వచ్చాడు. ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడో లేదో, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనై స్పృహతప్పి పడిపోయాడు. ఆశ్రమవాసులు ఒక కుటీరంలోనికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు.
భగవాన్ కు యీ కబురందగానే వచ్చారక్కడికి. ఆయనకేసి సుమారు పావుగంట సేపు చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్లు తెరచి భగవాన్ ను చూశారు. కాని, మాట్లాడలేకపోయారు. 'మౌనమే ఎడతెగని భాష ' అన్నారు భగవాన్. ఆయన మనసులోని ఆవేదనను కనిపెట్టి, ఆ తరువాత మరికొన్నినిముషాలు కూర్చుని వెళ్లిపోయారు. మరునాటికి సోమర్సెట్ మాం భగవాన్ ఆసీనులై ఉన్న హాల్ లోనికి రాగలిగారు. చాలాసేపు కూర్చుని నమస్కరించి వెళ్లిపోయారు.
'నేను అనేకమంది మహాత్ములను గురించి విన్నాను. కొంతమందిని దర్శించాను.అయితే,
శ్రీ రమణుల సన్నిధిలో అనుభవించిన మధురానుభూతిని,ఆనంద సాగర తరంగాల మీద
తేలిపోతున్న అనుభూతిని ఎప్పుడూ పొందలేదు '
అని రాశారు తన రచన 'మహర్షి ' ( The Saint ) అనే పుస్తకంలో.
భగవాన్ కు యీ కబురందగానే వచ్చారక్కడికి. ఆయనకేసి సుమారు పావుగంట సేపు చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్లు తెరచి భగవాన్ ను చూశారు. కాని, మాట్లాడలేకపోయారు. 'మౌనమే ఎడతెగని భాష ' అన్నారు భగవాన్. ఆయన మనసులోని ఆవేదనను కనిపెట్టి, ఆ తరువాత మరికొన్నినిముషాలు కూర్చుని వెళ్లిపోయారు. మరునాటికి సోమర్సెట్ మాం భగవాన్ ఆసీనులై ఉన్న హాల్ లోనికి రాగలిగారు. చాలాసేపు కూర్చుని నమస్కరించి వెళ్లిపోయారు.
'నేను అనేకమంది మహాత్ములను గురించి విన్నాను. కొంతమందిని దర్శించాను.అయితే,
శ్రీ రమణుల సన్నిధిలో అనుభవించిన మధురానుభూతిని,ఆనంద సాగర తరంగాల మీద
తేలిపోతున్న అనుభూతిని ఎప్పుడూ పొందలేదు '
అని రాశారు తన రచన 'మహర్షి ' ( The Saint ) అనే పుస్తకంలో.
ఒకనాడొక కుక్క కొండమీదనుంచి ఆశ్రమంలోనికి వచ్చి మొరగడం ప్రారంభించింది.
అదెంత మొరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చివరికి భగవాన్ వచ్చి ఆ కుక్కకు అన్నం పెట్టించారు.
తిని వెళ్ళిపోయిందది.
తరవాత అన్నారు భగవాన్ 'వారొక సిద్దపురుషులు.
ఆశ్రమభిక్ష స్వీకరించాలని ఆ రూపంలో వచ్చారు ' అని.
అదెంత మొరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చివరికి భగవాన్ వచ్చి ఆ కుక్కకు అన్నం పెట్టించారు.
తిని వెళ్ళిపోయిందది.
తరవాత అన్నారు భగవాన్ 'వారొక సిద్దపురుషులు.
ఆశ్రమభిక్ష స్వీకరించాలని ఆ రూపంలో వచ్చారు ' అని.
భగవాన్ పచ్చయ్యమ్మ కోయిలలో వుంటూ వుండే రోజుల్లో, ఓ రోజు మద్రాసునుంచి వారి భక్తులు రంగస్వామి అయ్యంగారు వొచ్చారు. మధ్యాన్నం వొంటిగంటకి మండుటెండలో, ఆలయం ఎదురుగా వుండే కొలనులో స్నానానికి వెళ్ళారు. అదంతా అడవి. ఎవరూ లేరు. హాయిగా స్నానం చేస్తున్నారు అయ్యంగారు.
భక్తులతో మాత్లాడుతో వున్న భగవాన్ చప్పున లేచారు.
అక్కడికొక చిరుత పులి వొస్తోంది, దాహం తీర్చుకోవడానికి.
అయ్యంగారు ఇవతల వొడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతని చూడలేదు.
'ఇపుడు పోయి కొంచెం ఆగి తరువాత రా,
నిన్ను చూసి అయ్యంగారు భయపదతారు ' అన్నారు భగవాన్.
చిరుతపులి వెళ్ళిపోయింది.
భక్తులతో మాత్లాడుతో వున్న భగవాన్ చప్పున లేచారు.
అక్కడికొక చిరుత పులి వొస్తోంది, దాహం తీర్చుకోవడానికి.
అయ్యంగారు ఇవతల వొడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతని చూడలేదు.
'ఇపుడు పోయి కొంచెం ఆగి తరువాత రా,
నిన్ను చూసి అయ్యంగారు భయపదతారు ' అన్నారు భగవాన్.
చిరుతపులి వెళ్ళిపోయింది.
పెరూ దేశం నుంచి వొక భార్యా భర్తా వొచ్చారు ఆశ్రమానికి . వాళ్ళు భగవాన్ని దర్శించి తమ కథనంతా చెప్పుకున్నారు. భగవాన్ విషయం చదివినప్పటి నుంచి జీసస్ తిరిగి భూమి మీద అవరతించినట్టుగా భావించి, ఆయనని దర్శించుకోవాలని ఆశించారు. కాని డబ్బులేదు. ప్రతి వారమూ తమ జీతంలో కొంత దాచి కొన్నేళ్ళకి స్టీమర్లో చాలా బీద ప్రయాణీకుల కింద బయలుదేరారు. కొన్ని నెలలు ప్రయాణంలో అవస్థలు పడ్డారు.
వారి చరిత్రనంతా భగవాన్ జాగ్రత్తగా విని -
'ఇన్ని కష్టాలుపడి ఇంత దూరం ఎందుకు వొచ్చారు?
అక్కడనించి నన్ను తలుచుకుంటే సరిపోదా?
ఇక్కడికి వొచ్చి నన్ను చూసినంత ఫలితమూ, తృప్తీ అక్కడే కలిగేది కద మీకు?' అన్నారు.
వారి చరిత్రనంతా భగవాన్ జాగ్రత్తగా విని -
'ఇన్ని కష్టాలుపడి ఇంత దూరం ఎందుకు వొచ్చారు?
అక్కడనించి నన్ను తలుచుకుంటే సరిపోదా?
ఇక్కడికి వొచ్చి నన్ను చూసినంత ఫలితమూ, తృప్తీ అక్కడే కలిగేది కద మీకు?' అన్నారు.
'ఒకసారి మానవజన్మ ఎత్తిన తరువాత మళ్ళీ నీచజన్మలు ఎత్తడానికి తావుందా?'
అన్న ప్రశ్న బయలుదేరింది ఆశ్రమంలో ఒకనాడు. ఇదమిద్దమని తేలలేదు. భగవాన్ ని అడిగారు.
'చాలా పుణ్యం చేసుకున్న మానవుడు కూడా ఏదో జంతు జన్మ నెత్తవచ్చు.
ఎందుకంటే జంతువు యొక్క ఆయుషు తక్కువనీ, ప్రారబ్దశేషాన్ని
త్వరగా అనుభవించివెయ్యొచ్చనీ, అటువంటి జన్మని కావాలని కోరుకునే
ఉత్తమ మానవులున్నారు ' అని బదులిచ్చారు భగవాన్.
అన్న ప్రశ్న బయలుదేరింది ఆశ్రమంలో ఒకనాడు. ఇదమిద్దమని తేలలేదు. భగవాన్ ని అడిగారు.
'చాలా పుణ్యం చేసుకున్న మానవుడు కూడా ఏదో జంతు జన్మ నెత్తవచ్చు.
ఎందుకంటే జంతువు యొక్క ఆయుషు తక్కువనీ, ప్రారబ్దశేషాన్ని
త్వరగా అనుభవించివెయ్యొచ్చనీ, అటువంటి జన్మని కావాలని కోరుకునే
ఉత్తమ మానవులున్నారు ' అని బదులిచ్చారు భగవాన్.
భగవాన్ కి తమ పనులు తాము చేసుకోవడమేగాక ఆశ్రమం పనులు కూడా చూడ్డం అలవాటు. అరుగులు అలుకుతారు. నేల తుడుస్తారు. విస్తళ్ళు కుడతారు. కూరలు తరుగుతారు. పచ్చళ్ళు రుబ్బుతారు. వంట చేస్తారు. వంట భగవాన్ దగ్గరే నేర్చుకోవాలి. నలుడూ, భీముడూ చేసినంత బాగా చేస్తారన్నంత ప్రతీతి. దేన్నీ వృధా పోనియ్యరు. తొక్కలనీ, తొడిమెలనీ కూడా పారెయ్యనియ్యరు. వాటితో పచ్చడి చేస్తారు. పులుసులో పడేస్తారు. వారి చెయ్యి పడితే చాలు అది అమృత ప్రాయంగా తయారవుతుంది.
ఎంతసేపటికీ పప్పు ఉడకడం లేదని శాంతమ్మ చిరాకుపడి, అక్కడే వున్న భగవాన్ తో చెప్పిందా విషయం.
'దాని మొహాన చారెడు ఉప్పు కొట్టు. ' అన్నారు భగవాన్.
ఉప్పు వేస్తే పప్పు ఉడకదని తెలుసు శాంతమ్మకి. అయినా, భక్తితో భగవాన్ చెప్పినట్టే చేసింది.
పర్యవసానం ? పప్పు చక్కగా వుడికి వూరుకుంది.
ఎంతసేపటికీ పప్పు ఉడకడం లేదని శాంతమ్మ చిరాకుపడి, అక్కడే వున్న భగవాన్ తో చెప్పిందా విషయం.
'దాని మొహాన చారెడు ఉప్పు కొట్టు. ' అన్నారు భగవాన్.
ఉప్పు వేస్తే పప్పు ఉడకదని తెలుసు శాంతమ్మకి. అయినా, భక్తితో భగవాన్ చెప్పినట్టే చేసింది.
పర్యవసానం ? పప్పు చక్కగా వుడికి వూరుకుంది.
ఒకరోజు పాశ్చాత్యవ్యక్తి ఒకరు భగవాన్ దర్శనార్థం అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి, భగవాన్ సన్నిధిలో మూడు గంటలు కూర్చుని వెళ్కిపోయాడు. భగవాన్ ని పలకరించనయినా లేదు. అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఒక భక్తుడడిగాడు.
'అంతదూరం నుంచి ప్రత్యేకంగా వొచ్చి అంతసేపూ కిక్కురు మనకుండ కూర్చుని వెళ్ళీపోయాడే ' మని .
'వారొక పనిమీద వచ్చారు. వచ్చిన పని పూర్తయింది.
ఇక్కడే వుండిపోవాలనేదేముంది ' అన్నారు భగవాన్.
'అంతదూరం నుంచి ప్రత్యేకంగా వొచ్చి అంతసేపూ కిక్కురు మనకుండ కూర్చుని వెళ్ళీపోయాడే ' మని .
'వారొక పనిమీద వచ్చారు. వచ్చిన పని పూర్తయింది.
ఇక్కడే వుండిపోవాలనేదేముంది ' అన్నారు భగవాన్.
ఒకసారి ఒకాయన
'ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గరికి. నాలో ఏ మార్పూ కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను '
అని దుఃఖపడ్డాడు. 'ఈ దారిలో మైలు రాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోతోందీ నీ కెట్లా తెలుస్తుంది ?
మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు?
గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు.
వాడు చెయ్యవలసింది అంతే.
స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు ' అన్నారు.
'ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గరికి. నాలో ఏ మార్పూ కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను '
అని దుఃఖపడ్డాడు. 'ఈ దారిలో మైలు రాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోతోందీ నీ కెట్లా తెలుస్తుంది ?
మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు?
గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు.
వాడు చెయ్యవలసింది అంతే.
స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు ' అన్నారు.
ఒకసారి ఒకాయన తాను పాపిని అని ఏడ్చాడు భగవాన్ ముందు.
'నిద్రలో ఏముండింది ? పుణ్యం వుందా, పాపం వుందా ? నిద్రలో నువ్వు పుణ్యుడివా?పాపివా? ఎవరు నువ్వు? '
'నాకు తెలీదు, '
'ఇప్పుడుమాత్రం ఏం తెలుసు నీకు, నువ్వెవడివో చెప్పేందుకు?
నువ్వు చేసింది పుణ్యమో, పాపమో, ! పుణ్యం అనుకుంటే అది పుణ్యం,
పాపం అనుకుంటే అది పాపమూనా ? పుణ్యమూ పోతుంది, పాపమూ పోతుంది.
మిగిలివుండేది నువ్వే ' .
'నిద్రలో ఏముండింది ? పుణ్యం వుందా, పాపం వుందా ? నిద్రలో నువ్వు పుణ్యుడివా?పాపివా? ఎవరు నువ్వు? '
'నాకు తెలీదు, '
'ఇప్పుడుమాత్రం ఏం తెలుసు నీకు, నువ్వెవడివో చెప్పేందుకు?
నువ్వు చేసింది పుణ్యమో, పాపమో, ! పుణ్యం అనుకుంటే అది పుణ్యం,
పాపం అనుకుంటే అది పాపమూనా ? పుణ్యమూ పోతుంది, పాపమూ పోతుంది.
మిగిలివుండేది నువ్వే ' .
ఆశ్రమం పక్కనే వున్న దక్షిణామూర్తి మంటపంలో ఒకాయన భంగు తాగి కేకలు వేస్తుండేవాడు. జయంతికి ఆయన్ని ఎవరూ గమనించలేదు. ఆయన గబ గబా భగవాన్ ముందుకు వొచ్చి, అధికారంగా డిమాండ్ చేస్తో -
'నీ గేటు దగ్గిర దర్వాన్ కి నువ్వు భోజనం పెట్టుకోకపోతే ఎవరు పెడతారనుకున్నావు ? ' అని గర్జించాడు.
దానికి భగవాన్ మహా వినయ స్వరంతో -
'అట్లాగా! ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా! మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే, ఎవరు పెడతారు? పొరపాటయింది, ఈసారికి వూరుకోండి.
మాధవా! ఈయన్ని తీసుకునివెళ్ళి భోజనం పెట్టించు ' అన్నారు.
పాపులమనుకునేవారు అనేకమంది వొచ్చేవారు భగవాన్ ముందుకి.
ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి.
'నీ గేటు దగ్గిర దర్వాన్ కి నువ్వు భోజనం పెట్టుకోకపోతే ఎవరు పెడతారనుకున్నావు ? ' అని గర్జించాడు.
దానికి భగవాన్ మహా వినయ స్వరంతో -
'అట్లాగా! ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా! మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే, ఎవరు పెడతారు? పొరపాటయింది, ఈసారికి వూరుకోండి.
మాధవా! ఈయన్ని తీసుకునివెళ్ళి భోజనం పెట్టించు ' అన్నారు.
పాపులమనుకునేవారు అనేకమంది వొచ్చేవారు భగవాన్ ముందుకి.
ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి.
భగవాన్ కొద్దిరోజుల్లో నిర్యాణం చెందుతారనగా ఒక ఉదయం పార్సీ అతను Framjie మతం ప్రార్థన
'ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగ పడుతున్నాను '
అనేది భగవాన్ ఎడల చదివాడు.
దానికి భగవాన్
'సూర్యుడు అస్తమిస్తున్నాడు , అదెట్లా సందర్భమవుతుంది? ' అన్నారు.
'ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగ పడుతున్నాను '
అనేది భగవాన్ ఎడల చదివాడు.
దానికి భగవాన్
'సూర్యుడు అస్తమిస్తున్నాడు , అదెట్లా సందర్భమవుతుంది? ' అన్నారు.
Subscribe to:
Posts (Atom)