|| భిక్ష ||
బ్రాహ్మణస్వామిగా భిక్షాటనకు వెళ్లిన రోజుల గురించి ఒకసారి మాటల్లో భగవాన్ ఇట్లా చెప్పారు .
'నేను భిక్ష ఎత్తే రోజుల్లో, లోకానికి చక్రవర్తిననిపించేది.
చేతిలో ఒక మట్టి మూకుడైనా వుండేది కాదు.
చేతిలో ఒక మట్టి మూకుడైనా వుండేది కాదు.
ఎవరి ఇంటి ముందు అయినా ఆగి, చప్పట్లు చరిచేవాడిని.
వారు ఏదైనా పెడితే, దోసిలిపట్టి,
అక్కడే తిని చేతులు తలకు తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని.
ఒకే ఇంటికి రెండుసార్లు వెళ్ళేవాడిని కాదు.
ఒకే ఇంటికి రెండుసార్లు వెళ్ళేవాడిని కాదు.
తిరువణ్ణామలైలో నేను తిరగని వీధంటూ లేదు.
నేను ఎప్పుడు భిక్షకు వస్తానా అని కొందరు నా కోసం ఎదురు చూసేవారు.
కొందరు ఏమన్నా మిగిలితే పెట్టేవారు.
కొందరు 'నీ కేరా, బలిసి దుక్కలా వున్నావు. ఫో! కూలి పని చేసుకో!' అని కసిరేవారు.
నేను నవ్వుకుంటో వెళ్లిపోయేవాడిని.
