Showing posts with label సుందరేశయ్యర్. Show all posts
Showing posts with label సుందరేశయ్యర్. Show all posts
Thursday, March 31, 2022

 

|| వెంకట్రామన్ ||

1879 - డిశంబరు 30వ రాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. 
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం. 
పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమిది. 
ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. 

ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూత్రిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చిళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.

ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. 
వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వుండేవారు. 
వారు తండ్రిని 'నాయనా' అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు 'వెంకట్రామన్ '  అని పేరు పెట్టారు. 

ఆ తర్వాత ఆ దంపతులక్కు 'నాగసుందరం' అనే కొడుకూ, 'అలిమేలు '  అనే కూతురూ కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, 
నిద్ర ఎక్కువగా ఉండేది, అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాధేశ్వరస్వామి ఆలయం ప్రక్కన వున కఖ్ళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరమొలోనో ఆటలాడుకునేవాడు. 
అతనికి ఎనిదిదవ ఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.

II

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, 
ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. 
వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, 
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. 
వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు. 
చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామ న్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, 
అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  
అని చెప్పేవారు భగవాన్.

విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి | ఈ ముక్కలన్నీ మీవి, తీసుకొచ్చాను

Wednesday, July 1, 2009
సుందరేశయ్యర్ జ్ఞాపకాల్లో ...

ఒక రోజు మా ఆవిడ దోసెలు చేస్తూంది. 'విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి ' అని నవ్వుతూ వెళ్ళిపోయాను. ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాను. 'అన్ని దోసెలు ముక్కలై వొచ్చాయి.' అని ఆ ముక్కల్ని చూపింది. ఏం చెయ్యను? ఏమి అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకొనిపోయి వారి ముందర పెట్టాను.

'ఏమిటిది?' అన్నారు.
'నా భార్య దోసెలు చేస్తోవుంటే నవ్వులాటకి నేను, మాణిక్యవాచకర్ కథలో మల్లే,
విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వొచ్చాను.
ఒకటీ సరిగా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి గనక మీకు తీసుకొచ్చాను ' అన్నాను.

నవ్వుతో ఆయన నాలుగు ముక్కలు తిని, తక్కినవి భక్తులకు పంచి పెట్టించారు.

ఒకసారి చిన్నస్వామికి నా మీద అమితమైన కోపంగా ఉంది. ఆ దిగులులో నేను రాత్రి భోజనం చెయ్యలేదు. తెల్లారి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో నిలువ మనస్కరించలేదు. భగవాన్ తెల్లారకట్ల ఇడ్లీ చేస్తున్నారు. వెళ్లి నమస్కరించాను. 'ఏమిటి సమాచారం?'
'టవునుకు వెడతాను.'
'ఎందుకు?'
'పిల్లలు ట్యూషన్ కు కాచుకుని ఉంటారు.'
'తెలుసు. నాకు తెలుసు నీ దొంగతనం, ఆదివారంనాడు నీకు ట్యూషన్ ఏమిటి? ఎవరికి చెప్పుతావు? వంకాయ సాంబారు చేశాను మధ్యాహ్నానికని. ఇప్పుడే నీకు వేసి పెడతాను. రా. తిను . పద, కూచో ' అని తొందరగా విస్తళ్ళు వేశారు.

తానూ నా పక్కన కూచుని నా దిగులు మరచిపోయేట్టు ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించారు.
అట్లాంటిది భగవాన్ కరుణ.

జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ

Friday, June 19, 2009
భగవాన్ భక్తుడు మహాదేవయ్యర్ ఓ నెల రోజుల నుంచి మద్రాసులో ఎక్కిళ్ళతో బాధపడుతున్నారు. ఆ జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది. బెల్లమూ, శొంటి పొడుం నూరి తింటే ఎక్కిళ్ళు నయమౌతాయని రాయమని, మాధవస్వామి (పరిచారకుడు) వేపు తిరిగి . . . 'తయారు చేసిన మందు మన దగ్గిర వుండాలి కదూ!' అని అడిగారు. మాధవస్వామి ఆ బుడ్డి తీసుకొచ్చాడు.

దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులకి కొంచెం పంచిపెట్టారు.
అది చూసి సుందరేశయ్యర్ అనే భక్తుడు 'ఇంకా ఉత్తరం కూడా ఎందుకు? మహాదేవయ్యర్ కి యీ పాటికి ఎక్కిళ్ళు నయమై వుంటాయి ' అని. ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను. కాని ఆ ఉత్తరం అందకుండానే, మర్నాటికే ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నించి అయ్యర్ గారికి ఎక్కిళ్ళు కట్టాయి అని.

సరిగా అదే సమయానికి భగవాన్ మందు తిన్నది.

భగవాన్ స్మృతులు | ఆత్మహత్య

Wednesday, May 27, 2009
సుందరేశయ్యర్ భగవాన్ భక్తుడు. అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. భరించలేకపోయాడు. ఆత్మహత్యకు సిద్దపడ్డాడు. సిద్దమై కడసారిగా భగవాన్ దర్శనానికివెళ్లాడు. భగవాన్ అప్పుడు విస్తళ్ళు కుడుతున్నారు.

సుందరేశయ్యర్ ఏమీ అడక్కుండానే

'చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో! అడవికి వెళ్ళాలి. ఆకులు ఏరి తేవాలి. వాటిని ఎండబెట్టాలి. పుల్లలు తేవాలి. వాటిని సన్నగా చీల్చాలి. అప్పుడీ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టు గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతలపారేస్తామా? అదెందుచేత కుట్టబడిందో ఆ పని అయిన తరవాతగాని పారేయం. అనగా, దాంట్లో భోంచేసింతరువాతగాని పారేయం ' అన్నారు భగవాన్.

Blessing

Blessing
Bhagavan Memories