పశు-పక్ష్యాదులు | కోతి, ముంగిస
భగవాన్ విరూపాక్ష గుహలో వుండే రోజుల్లో ఒక పెద్ద కోతి
మరో కోటిపిల్లను బాగా కరిచింది. ఆ పిల్ల మూర్చపోతే చనిపోయిందనుకుని,
తక్కిన కోతులన్నీ దాన్ని వదలి వెళ్ళిపోయాయి.
కాని, ఆ కోతిపిల్ల కాస్సేపటికి కోలుకుని, నెమ్మదిగా భగవాన్ దగ్గరకు చేరింది.
అది బ్రతికి బైటపడింది కాని, దాని కాలు కుంటుపడింది,
అందుచేత అందరూ దాన్ని 'నొండి ' అంటే 'కుంటి ' అని పిలిచేవారు.
భగవాన్ దాన్ని శ్రద్ధగా చూసి కాపాడారు.
ఒక రోజున నొండి కోసం భగవాన్ వేడి పాలు చల్లారుస్తో వుంటే ,
తన వాటా పాలు భగవాన్ తాగేస్తున్నారనుకుని, నొండి ఆయన్ని
చెంపమీద కొట్టింది. అయినా భగవాన్ దాన్ని ప్రేమగా తీసుకున్నారు.
నొండి క్రమంగా కోలుకుంది. అది చనువుగా భగవాన్ తొడమీద కూర్చునేది.
ఆయన పక్కన చక్కగా కూర్చుని భోజనం చేసేది.
ఒక రోజున అది అన్నం వెదజల్లుతూ తింటూ వుండే, 'శుభ్రంగా తిను ' అన్నారు భగవాన్.
ఆ మాటకు దానికి రోషం వచ్చి, భగవాన్ని చెంప మీద కొట్టింది.
ఆ తర్వాత భగవాన్ దాన్ని కొన్నాళ్ళు తన తొడ మీద కూర్చోనివ్వలేదు.
అది పశ్చాత్తాప్పడి, భగవాన్ని బ్రతిమాలింది, ప్రార్థించింది.
అది ఆయన దగ్గరకు వెళ్ళి, మనుష్యులు మాదిరిగా గెడ్డం పట్టుకుని బ్రతిమాలింది, ప్రాధేయపడింది. చివరికి అది ఆయన అనుగ్రహం పొంది,
మళ్ళా ఆయన తొడపై కూర్చోవడం ఆరంభించింది.
నొండి అంటే భగవాన్ కి యెంతో ప్రేమ.
భగవాన్ స్కందాశ్రమంలో వున్నప్పుడు ఒక రోజున కొందరు భక్తులు
భగవాన్ స్కందాశ్రమంలో వున్నప్పుడు ఒక రోజున కొందరు భక్తులు
ఆయన చుట్టూ కూర్చుని వున్నారు. అంతలో ఒక ముంగిస వచ్చి,
భగవాన్ తొడమీద నిర్భయంగా కూర్చున్నది. దన్ని చూస్తో,
'వీరు ఎందుకు వచ్చారో, యెవరికి తెలుసు? ఇది సామాన్యమైనది కాదు ' అన్నారు.
భగవాన్ పాముల్ని చంపనిచ్చేవారు కాదు.
'మనం వాటి స్థానంలోకి వచ్చాం. వాటిని బాధించడానికీ, చంపడానికీ,
కనీసం వాటిని కదల్చడానికీ, యేం చెయ్యడానికీ మనకు హక్కులేదు.
అవి మనల్ని తొందర పెట్టవు ' అన్నారు.

