'దయతో భిక్షకు గంటకొట్టారు. మనం అలస్యం చేస్తే, పెట్టకుండా నిరాకరించడ,లో
వారికే న్యాయం వుంటుంది. కనుక త్వరగా భోజనానికి వెడదాం ' అని బయలుదేరేవారు.
మితాహారం, మితనిద్ర, మిత భాషణ మంచిదన్నారు భగవాన్. చాలాసారులు విస్తలో వడ్డించిన పదార్ధాలన్నీ కలిపి తినేవారు. నెమ్మదిగా భోజనం చేసేవారు.
వడ్డించినవన్నీ శుభ్రంగా, పూర్తిగా తినేవారు. ఒక్క మెతుకు విడిచిపెట్టకుండా తినేవారు.
భగవాన్ అనారోగ్యంతో వున్నప్పుడూ, రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత,
మధ్యాహ్నం విశృఆంతివేళా భగవాన్ దర్శనానికి యెవరీనా వస్తే,
ఆశ్రమాధికారులు అనుమతి ఇచ్చేవారు కాదు.
కొన్నాళ్ళ తర్వాత ఆ సంగతి తెలిసి, 'నా కోసం అన్ని వేళలా ప్రజలు వస్తారు.
దర్శన సమయమంటూ పెడితే, వారు తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంది.
దర్శనానికి టైం ఏమిటి?
మీరు వాళ్ళను లోపలకు రానివ్వకపోతే,
నేనే వెళ్ళి వరండాలో కూర్చుని, వాళ్ళను కలుసుకుంటాను,
మీ హాలూ, తలుపులూ అవీ మీరు చూసి వేసుకోండి ' అన్నారు భగవాన్.
