ఆశ్రమం పైన ఒక పెద్ద ఫిర్యాదు వుంటో వుండేది, గొప్పవారిని ఎక్కువగా చూస్తారని, ఒకాయన యీ హెచ్చుతగ్గుల సంగతి భగవాన్ తో చెప్పుకుంటో వుండగా భగవాన్ కి మధ్యాహ్నం కాఫీ వచ్చింది. మధ్యాహ్నాలు భగవాన్ హాలులో అందరి మధ్యా కూచుని వుండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి
'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.
'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.
ఆయనకి భగవాన్ ఇచ్చింది కాఫీ కానేకాదు, ఏదో ఔషధులు వేసి కాచిన కషాయం. అది భగవాన్ తాగవలసిందే కాని తదితరులకు దుసాధ్యం. తీరా తీసున్నాడు . వద్దనడానికి వీల్లేదు. అందరి మధ్య వున్నాడు. పారపొయ్యటానికి వీల్లేదు. భగవాన్ ప్రసాదం, ఆయన చేత్తో ఇచ్చింది. ఆనాటి ఆయన యాతన ఆ భగవాన్ కే ఎరుక.
0 comments:
Post a Comment