|| వెంకట్రామన్ ||
1879 - డిశంబరు 30వ రాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు.
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం.
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం.
పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమిది.
ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం.
ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూత్రిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చిళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.
ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి.
వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వుండేవారు.
వారు తండ్రిని 'నాయనా' అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు 'వెంకట్రామన్ ' అని పేరు పెట్టారు.
ఆ తర్వాత ఆ దంపతులక్కు 'నాగసుందరం' అనే కొడుకూ, 'అలిమేలు ' అనే కూతురూ కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ,
నిద్ర ఎక్కువగా ఉండేది, అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాధేశ్వరస్వామి ఆలయం ప్రక్కన వున కఖ్ళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరమొలోనో ఆటలాడుకునేవాడు.
అతనికి ఎనిదిదవ ఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.
II
సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని,
ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు.
వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి,
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు.
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు.
వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు.
చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, అతనికి మెలకువ రాలేదు.
వెంకట్రామ న్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా,
అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '
అని చెప్పేవారు భగవాన్.