Tuesday, April 12, 2022
 || ఆయన కళ్ళల్లోంచి కాంతి ||



భగవాన్ యెవరినీ తన దగ్గరకు రమ్మనలేదు. 
వచ్చిన వారిని వెళ్లి పొమ్మనలేదు. వుండమని యెవరినీ బలవంతం చేయలేదు. 
ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన ఏకైక పుత్రుణ్నో, 
పుత్రికనో చూసుకునే దయకల తల్లి మాదిరిగా ప్రేమగా పలకరించి, 
తీసుకునేవారు. అందరి యెడలా ఒకే విధమైన ప్రేమ, దయ, 
మర్యాద, గౌరవం చూపేవారు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి వారినీ 
ముందుగా, 'భోజనం చేశారా?' అని అడిగేవారు.

భగవాన్ యెంతోసేపు శిలాప్రతిమలాగ కూర్చుండిపోయేవారు. 
ఆయన కళ్ళల్లోంచి కాంతి వరదలుగా వచ్చి, పడుతున్నట్లు వుండేది. 
ఆయన కళ్ళకాంతిని వర్ణించడం కష్టమంటారు. 
ఒకసారి భరించరాని దుఖంతో వచ్చిన వాని విషాదగాధ విని, 
అతని వంక ఎంతో దయగా చూశారు. అంతే! అతని హృదయం 
శాంతితో నిండిపోయి సంతోషంతో వెళ్ళిపోయేవాడు.
భగవాన్ ఒక్కోసారి యేదోరాస్తో దీర్ఘాలోచనల్లో పడేవారు. 

అటువంటప్పుడు ఆయన కళ్ళు పెద్దవయ్యేవి. 
మనసులో ఆలోచనలు మాదిరిగా, ఆయన కళ్ళు అటూ, ఇటూ 
చురుకుగా కదిలేవి. కొందరితో కలిసి నవ్వేవారు. 
కొందరితో కలిసి విచారించేవారు. కొన్నిసార్లు కన్నీరు కార్చిన సంధర్భాలూ లేకపోలేదు.

పిల్లలతో,కోతులతో, ఆడేవారు. ఒక్కోసారి పాడేవారు. 
కాని, రోజులో యెక్కువభాగం మౌనంగా వుండేవారు.

ఒకసారి కొందరు రమణ భక్తులు భగవాన్ సన్నిధిలో 
'రమణ సద్గురు - రమణ సద్గురు ...' అని పాడుతూవుంటే, 
భగవాన్ వారితో కలిసి కొంతసేపు పాడి, పాట అయిపోయిన తర్వాత 
తన దేహాన్ని చూపుతూ 'దీన్నేనా మీరు రమణ అంటున్నారు?' అని, 

'విశ్వమంతా యే దివ్య తేజస్సుతో వెలుగుతోందో, ఆ విశ్వ చైతన్యమే, అది. 
అదే రమణ. అంతా అదే! రమణ-అరుణాచలం-ఆత్మ, అన్నీ అదే. 
మీరూ అదే. దానియందు సంపూర్ణ ప్రేమ కలిగివుంటే, 
దాన్ని మీరు మీ అంతరాంతరాళాల్లో ప్రియతమునిగా దర్శిస్తారు. 
ఆ శుద్ధచైతన్యాన్ని నిర్మల, పవిత్ర జ్ఞాన నేత్రంతో దర్శించగలరు ' అనేవారు భగవాన్.

భగవాన్ యెక్కువగా తమిళంలో మాట్లాడేవారు. 
అప్పుడప్పుడూ తెలుగు, మళయాళం, కొంచెం కొంచెం ఇంగ్లీషులో మాట్లాడేవారు. 
యెవరైనా మామూలు విషయాలు మాట్లాడినా, తాత్విక విషయాలు మాట్లాడినా, 
యోగం-సాధన యే సంతతి చర్చించినా భగవాన్ చివరివరకు 
శ్రద్ధగా, జాగ్రత్తగా, ఓపికగా, ఓర్పుతో, ప్రేమతో వినేవారు.

భగవాన్ ప్రతీదీ స్వయంగా చేసి, చూసి అనుభవం పొందే తత్వం కలవారు. 
ఆయనకు దేంట్లోనూ హెచ్చుతగ్గులు లేవు. 
ఆయన అంగీకారం, అనంగీకారం, చాలా స్పష్టం. 
ప్రతివిషయంలో భవాను ఖరారుగా, ఖచ్చితంగా వుండేవారు. 
ప్రతిదాన్ని నిశితంగా, నిర్ధిష్టంగా, సన్నిహితంగా పరిశీలించేవారు. 

ఆయన చేసే ప్రతి పనీ చాలా విలువైనదిగా వుండేది. 
ఆశ్రమంలో రోజూ కేలండర్ తిప్పాలి. రేడియో ప్రకారం గడియారాలు సరిచేయాలి. 
ఆశ్రమ ఆవరణ పరిశుభ్రంగా వుండాలి. 
ప్రతి వస్తువూ వాటి వాటి స్థానంలో అందంగా, శుభ్రంగా వుండాలి. 

యేదీ వృధాకానిచ్చేవారు కాదు.
యెవరూ విస్తళ్ళలో మెతుకులు వదలకూడదు. 
పులిస్తరాకులు పశువులకు వేయించేవారు. 

యెన్ని జరిగినా 
భగవాన్ స్వేచ్చగా, శాంతంగా ఎప్పుడూ ఒకే విధంగా వుండేవారు.


పశు-పక్ష్యాదులు | ఉడతలు 


తన చుట్టూ చేరిన యావత్ మానవేతర ప్రాణికోటిని ఉద్దేశించి, 
'ఆ రూపాల్లో, ఆ దేహాల్లో వున్న ఆత్మలు యెటువంటివో, 
అవి మన సాన్నిహిత్యాన్ని యెందుకు కోరతాయో మనకు తెలియదు. 

పరిపూత్రి కాని కర్మను, పూర్తిచేసుకోవడానికి యీ పశుపక్ష్యాదులు 
మనని చేరుతున్నాయేమొ! మనకు తెలియదు ' అనేవారు భగవాన్.

భగవాన్ గురుమూత్రంలో ఉన్నప్పుడు పక్షులు, 
ఉడతలు ఆయన చుట్టూ తిరిగి, ఆడుకునేవి. కొన్ని 
ఆయనకు దగ్గరలో గూళ్లు కట్టుకుని, పిల్లల్ని పెట్టేవి. 
అవి ఏ దశల్లో, ఎన్నెన్ని రోజులకు యెటువంటి పరిణామాలు 
చెందుతున్నవీ కనిపెట్టి చూసేవారు, భగవాన్. అలా చూడ్డం వినోదం కోసం కాదు. 

వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమగా పరిశీలించేవారు. 
ఆయన యెప్పుడూ, యే జంతువునూ, యే పక్షిని 'ఇదీ-అదీ' అనలేదు. 
'లక్ష్మి ' కి అన్నం పెట్టండి, 'పిల్లలకు తిండి పెట్టారా?' అని పేర్లు పెట్టి అడిగేవారు.

ఒకసారి ఒక ఉడుతపిల్ల గూట్లోంచి కింద పడింది. 
దాన్ని తీసి గూట్లో పెట్టారు, భగవాన్. కాస్సేపటికి అది మళ్ళా కింద పడింది. 
దాన్ని తీసి మళ్ళా గూట్లో పెట్టారు. అది మళ్లా కింద పడింది. 
భగవాన్ మళ్ళా దాన్ని గూట్లో పెట్టారు. అది కింద పడటం, 
భగవాన్ దాన్ని తీసి గూట్లో పెట్టడం అదంతా చూసి, 
'మనసు విషయ వాసనల వైపు పోతూ వుంటే, దాన్ని స్వస్థానం చేర్చాలి. 
మనసూ ఉడత పిల్లంత చంచలం ' అన్నారు భగవాన్. 

పిపీలికాది బ్రహ్మపర్యంతం ఒకటిగా చూసే భగవాన్ కి, 
గూట్లోంచి ఉడుతపిల్ల కింద పడిందని గొడవపడ్డారంతే, 
అది మనం గొడవ పడినట్లు కాదు. 
ఆయన సహజ, సంపూర్ణ యెరుకలోంచే గొడవ పడతారు. 
అదంతా వారి ప్రేమ.

పశు-పక్ష్యాదులు | కోతి, ముంగిస



భగవాన్ విరూపాక్ష గుహలో వుండే రోజుల్లో ఒక పెద్ద కోతి 
మరో కోటిపిల్లను బాగా కరిచింది. ఆ పిల్ల మూర్చపోతే చనిపోయిందనుకుని, 
తక్కిన కోతులన్నీ దాన్ని వదలి వెళ్ళిపోయాయి. 
కాని, ఆ కోతిపిల్ల కాస్సేపటికి కోలుకుని, నెమ్మదిగా భగవాన్ దగ్గరకు చేరింది. 

అది బ్రతికి బైటపడింది కాని, దాని కాలు కుంటుపడింది, 
అందుచేత అందరూ దాన్ని 'నొండి ' అంటే 'కుంటి ' అని పిలిచేవారు. 
భగవాన్ దాన్ని శ్రద్ధగా చూసి కాపాడారు. 

ఒక రోజున నొండి కోసం భగవాన్ వేడి పాలు చల్లారుస్తో వుంటే , 
తన వాటా పాలు భగవాన్ తాగేస్తున్నారనుకుని, నొండి ఆయన్ని 
చెంపమీద కొట్టింది. అయినా భగవాన్ దాన్ని ప్రేమగా తీసుకున్నారు.

నొండి క్రమంగా కోలుకుంది. అది చనువుగా భగవాన్ తొడమీద కూర్చునేది. 
ఆయన పక్కన చక్కగా కూర్చుని భోజనం చేసేది. 
ఒక రోజున అది అన్నం వెదజల్లుతూ తింటూ వుండే, 'శుభ్రంగా తిను ' అన్నారు భగవాన్. 
ఆ మాటకు దానికి రోషం వచ్చి, భగవాన్ని చెంప మీద కొట్టింది. 
ఆ తర్వాత భగవాన్ దాన్ని కొన్నాళ్ళు తన తొడ మీద కూర్చోనివ్వలేదు. 
అది పశ్చాత్తాప్పడి, భగవాన్ని బ్రతిమాలింది, ప్రార్థించింది. 

అది ఆయన దగ్గరకు వెళ్ళి, మనుష్యులు మాదిరిగా గెడ్డం పట్టుకుని బ్రతిమాలింది, ప్రాధేయపడింది. చివరికి అది ఆయన అనుగ్రహం పొంది, 
మళ్ళా ఆయన తొడపై కూర్చోవడం ఆరంభించింది. 
నొండి అంటే భగవాన్ కి యెంతో ప్రేమ.
భగవాన్ స్కందాశ్రమంలో వున్నప్పుడు ఒక రోజున కొందరు భక్తులు 
ఆయన చుట్టూ కూర్చుని వున్నారు. అంతలో ఒక ముంగిస వచ్చి, 
భగవాన్ తొడమీద నిర్భయంగా కూర్చున్నది. దన్ని చూస్తో, 
'వీరు ఎందుకు వచ్చారో, యెవరికి తెలుసు? ఇది సామాన్యమైనది కాదు ' అన్నారు.

భగవాన్ పాముల్ని చంపనిచ్చేవారు కాదు. 
'మనం వాటి స్థానంలోకి వచ్చాం. వాటిని బాధించడానికీ, చంపడానికీ, 
కనీసం వాటిని కదల్చడానికీ, యేం చెయ్యడానికీ మనకు హక్కులేదు. 
అవి మనల్ని తొందర పెట్టవు ' అన్నారు.

పశు-పక్ష్యాదులు | నెమళ్ళు, కుక్క







 
'చిరుకరప్పన్ '  అనే ఓ నల్ల కుక్క వుండేది. అది అందరితో స్నేహంగా, 
ప్రేమగా వున్నట్లే, ఆశ్రమానికి వచ్చే ప్రతి కొత్తవారితోనూ 
అంత ప్రేమగా, స్నేహంగా, చనువుగా వుండేది. 

అది ఒకసారి ఆశ్రమానికి కొత్తగా వచ్చిన ఒక చాదస్తపు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళింది. 
అప్పుడు ఆయన జపం చేసుకుంటున్నారు, మడి కట్టుకుని, 
ఆయన దాన్ని భరించలేక కర్రతో కొట్టారు. 
ఆ కుక్క అభిమానంతో వెళ్ళి, మళ్ళా ఆశ్రమానికి తిరిగి రాలేదు.
 దాని మనసు అంతం సున్నితం. 

ఇంకోసారి పలనిస్వామి ఓ కుక్కను కొడితే, 
అది వెళ్ళి కొలనులో పడి ఆత్మహత్య చేసుకుంది. 

శ్రీరమణాశ్రమం ఏర్పడ్డాక భగవాన్ భోజన సమయంలో 
మొదట కుక్కలకు అన్నం పెట్టమనేవారు. 
తర్వాత ఎవరైనా భిక్షకులు వస్తే, వారికి భోజనం పెట్టాలి. 
చివరకు మిగిలింది ఆశ్రమవాసులు తినాలి.

బరోడా మహారాణిగారు శ్రీ రమణాశ్రమానికి రెండు తెల్ల నెమళ్ళు పంపించారు. 
వాటికి పెట్టే మామిడి పళ్ళు సరిగ్గా పండాయో, 
లేదో భగవాన్ స్వయంగా రుచి చూసి, వాటికి పెట్టించేవారు. 
ఒక్క ఆ నెమళ్ళ మీదనే కాదు, ఆయనకు అన్నింటిపైనా 
అంత శ్రధ్దే, ప్రేమే! ఆయన ఆ నెళ్ల అరుపుల్ని అనుకరించి వాటిని పిలిచేవారు.

***

1924 ప్రాంతంలో శ్రీరమణాశ్రమంలో నాలుగు కుక్కలు వుండేవి. 
భగవాన్ చేత్తో తిండి పెడితేనేగాని, అవి తినేవిగావు. వాటిల్లో ఒక దాని పేరు 'కమల ' .
'కమలా, ఈ కొత్తవారిని గిరి ప్రకక్షిణం తీసుకువెళ్ళు ' అని భవాన్ చెపితే, 
అది వారి వెంట తొమ్మిది మైళ్ళూ గిరిప్రదక్షిణం వెళ్ళి గిరి చుట్టూ వున్న 
ఆలయాల్ని, గ్ఫురాల్ని, కొలనుల్ని, మండపాల్ని, తీర్ధాల్నీ 
విగ్రహాల్ని చూపించి తీసుకొచ్చేది.

అది అన్నింటికంటే పెద్ద కుక్క. దాని సంతతే ఆశ్రమంలో వుండేవి. 
అది స్కందాశ్రమానికి చిన్న పిల్లగా వచ్చింది. 
అప్పటి ఆశ్రమవాసులు దాన్ని తరిమెయ్యాలని చూశారు. 
'ఎందుకంటే, అది ఆడకుక్క. ప్రతి సంవత్సరమ పిల్లల్ని పెడుతుంది. 
చికాకు కలిగిస్తుంది ' అనే నెపంతో. కాని, 

అది భగవాన్ని వదిలి పోలేదు. అది అక్కడే స్థిరపడింది. 
ఆశ్రమంలో దాని సంతతే నిలిచింది. 
 
పశు-పక్ష్యాదులు | ఉడతలు




భగవాన్ రోజూ ఉదయం, సాయంత్రం కొండ మీదకు వెళ్ళేవారు. 
దారిలో కనిపించిన జంతువుల్నీ, పక్షుల్నీ శ్రద్ధగా పరిశీలించేవారు. 
ఆయన అమృతహస్తం కింద యెన్నో కుక్కలు, కోతులు, 
ఉడతలు, రక్షణ తీసుకుని, శాంతి పొందాయి.

ఒక రోజున్ భగవాన్ కొండదిగి ఆశ్రమానికి వస్తోవుంటే, 
ఓ కుక్క ఉడతను తరుముతోంది. 
ఆయన ఆ కుక్కను ఆపబోయి బోర్లాపడ్డారు. చేతి ఎముక విరిగింది. 
కుక్క పారిపోయింది. ఉడత రక్షింపబడింది. 

జంత్వులు ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా సంపాదించేవి. 
ఆయన ప్రేమను చవి చూసేవి. ఆయన అమృతహస్తం కింద్ సురక్షితంగా వుండేవి.
ఆశ్రమం హాలులో భగవాన్ సోఫామీద కూర్చుంటే, 
కిటికీలోంచి ఉడతలు సోఫామిదికి దూకేవి. 
యన వాటికి వేరుశనగ గింజలు, పప్పులూ మొరమొరాలు పెట్టేవారు.

ఒక్కోసారి అవి ఆయన చేతుల్లోంచి పప్పులూ అవీ తీసుకుని, 
తినేవి. భగవాన్ వాటికోసం పప్పులు, గింజలు డబ్బాల్లో పోసి 
దగ్గర పెట్టుకునేవారు. 

భగవాన్ పశు-పక్ష్యాదులయందే కాదు, 
చెట్లయందూ అంతం ప్రేమ, దయ చూపేవారు. 
ఒకసారు ఒక భక్తురాలు వచ్చి, గొప్పగా, 'నేను లక్షపత్రి పూజ చేశాను ' అన్నది. 
దానికి భగవాన్ వెంటనే ' అంతకన్నా 
నిన్ను నువ్వు లక్షసార్లు గిల్లుకోకపోయినావా?' అన్నారు. 


|| భగవాన్ దర్శనం || 



వేదపారాయణ జరుగుతున్నా, పాట సాగుతున్నా, భోజనానికి గంట కొట్టగానే భగవాన్ లేచి, 
'దయతో భిక్షకు గంటకొట్టారు. మనం అలస్యం చేస్తే, పెట్టకుండా నిరాకరించడ,లో 
వారికే న్యాయం వుంటుంది. కనుక త్వరగా భోజనానికి వెడదాం ' అని బయలుదేరేవారు. 

మితాహారం, మితనిద్ర, మిత భాషణ మంచిదన్నారు భగవాన్. చాలాసారులు విస్తలో వడ్డించిన పదార్ధాలన్నీ కలిపి తినేవారు. నెమ్మదిగా భోజనం చేసేవారు. 
వడ్డించినవన్నీ శుభ్రంగా, పూర్తిగా తినేవారు. ఒక్క మెతుకు విడిచిపెట్టకుండా తినేవారు. 

భగవాన్ అనారోగ్యంతో వున్నప్పుడూ, రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత, 
మధ్యాహ్నం విశృఆంతివేళా భగవాన్ దర్శనానికి యెవరీనా వస్తే, 
ఆశ్రమాధికారులు అనుమతి ఇచ్చేవారు కాదు. 

కొన్నాళ్ళ తర్వాత ఆ సంగతి తెలిసి, 'నా కోసం అన్ని వేళలా ప్రజలు వస్తారు. 
దర్శన సమయమంటూ పెడితే, వారు తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంది. 
దర్శనానికి టైం ఏమిటి? 
మీరు వాళ్ళను లోపలకు రానివ్వకపోతే, 
నేనే వెళ్ళి వరండాలో కూర్చుని, వాళ్ళను కలుసుకుంటాను, 
మీ హాలూ, తలుపులూ అవీ మీరు చూసి వేసుకోండి ' అన్నారు భగవాన్.
|| దినచర్య || 




ఉదయం పకకొండు గంటలకు ఆశ్రమంలో భోజనానికి గంట కొట్టేవారు. 
భోజనశాలలో బ్రాహ్మణ-అబ్రాహ్మణ పట్టింపు వుంది. 

ఏ పట్టింపూలేని భగవాన్, ఆ విభాగం మధ్య కూర్చునేవారు-ఇరు పక్షాల వారికీ కంపించేటట్లుగా. భగవాన్ భోజనం చేయడం ఆరంభించేవరకూ ఎవరూ ఏ పదార్ధమూ ముట్టుకునేవారు కాదు. 
అందరికీ వడ్డించేవరకూ భగవాన్ తినేవారు కాదు.

భోజనానంతరం భగవాన్ తాంబూలం వేసుకునేవారు. 
దాన్ని పూర్తిగా నమిలిన తర్వాత, నోరు శుభ్రంగా కడుక్కునేవారు. 
పరిచారకుని నిర్లక్ష్యం వల్ల, వరసగా కొన్ని రోజులు భగవాన్ కి 
తాంబూలం ఇవ్వడం మరచిపోవడంతో ఆయన తాంబూలం వేసుకోవడం మానేశారు.

మధ్యాహ్నం రెండు గంటల వరకు భగవాన్ విశ్రాంతి తీసుకునేవారు. 
చివరి సంవత్సరాల్లో భగవాన్ ఆరోగ్యం కోసం ఆశ్రమాధికారులు 
విశ్రాంతి సమయంలో హాలు తలుపులు మూసేస్తే, 
ఒకాయన తెలియక లోపలకు వెడితే, పరిచారకుడు కటువుగా మాట్లాడి కసిరాడు. 

ఆ సంగతి తెలిసి భగవాన్ మర్నాడు భోజనానంతరం 
హాలు బైట మెట్ల మీద కూర్చునేవారు.
Friday, April 1, 2022

 Bhagavan and Maharshi


https://murtymandala.blogspot.com/2011/03/maharshi-mahatma.html

https://www.quora.com/Did-Mahatma-Gandhi-meet-Ramana-Maharshi-at-any-time

Thursday, March 31, 2022

 

|| వెంకట్రామన్ ||

1879 - డిశంబరు 30వ రాత్రి ఒంటిగంట వేళ, అంటే ప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. 
అది ఆరుద్రా నక్షత్ర దర్శన పుణ్యదినం. 
పరమేశ్వరుడు, బ్రహ్మ - విష్ణువులకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన పర్వదినమిది. 
ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై - గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. 

ఆ శుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూత్రిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చిళిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.

ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. 
వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు వుండేవారు. 
వారు తండ్రిని 'నాయనా' అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు 'వెంకట్రామన్ '  అని పేరు పెట్టారు. 

ఆ తర్వాత ఆ దంపతులక్కు 'నాగసుందరం' అనే కొడుకూ, 'అలిమేలు '  అనే కూతురూ కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగా పెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, 
నిద్ర ఎక్కువగా ఉండేది, అయినా అతడు పిల్లలతో కలిసి భూమినాధేశ్వరస్వామి ఆలయం ప్రక్కన వున కఖ్ళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరమొలోనో ఆటలాడుకునేవాడు. 
అతనికి ఎనిదిదవ ఏట, శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు.

II

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, 
ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. 
వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, 
వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. 
వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు. 
చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామ న్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, 
అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు.
'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  
అని చెప్పేవారు భగవాన్.
Tuesday, March 29, 2022

  || అక్షర మణమాల ||



పెరుమాళ్ళస్వామి, 

స్వామి సేవ చేసుకుంటో ఊళ్ళో ఓ సత్రంలో భోజనం చేసేవారు. 

కొన్నాళ్ళకు ఆ సత్రంవారికి ఆయన పద్దతి నచ్చలేదు.


అప్పుడు పెరుమాళ్ళస్వామి, భగవాన్ తో      

'భిక్షుక వృత్తి స్వీకరించి, భిక్ష ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతాను. 

ఆ సమయంలో పాడుకునేందుకు నాకో పాట రాసి ఇవ్వండి ' అని స్వామిని అర్థించారు. 

తత్ఫలితంగా 'అరుణాచలశివ, అరుణాచలశివ, 

అరుణాచలశివ, అరుణాచలా!' అనే పల్లవితో స్వామి పాట కట్టారు. 


అదే 'అక్షర మణమాల ' . 

|| చిన్నస్వామి ||








1916 చివరలో, స్వామి స్కందాశ్రమానికి మకాం మార్చారు. 
అందరితో పాటు అలఘమ్మ కూడా అక్కడకు చేరింది. స్వామితో స్థిరపడింది. 
అక్కడ ఆమె వంట చేసేది. ఓ స్థిరనివాసం, వంటా అన్నీ ఏర్పాటుకావడంతో, కొత్తవారు వచ్చి స్వామితో స్థిరపడ్డారు. వారూ తలొక పనీ చేసేవారు. 

స్వామి కూడా వంటలో సహాయం చేసేవారు. కొందరు గోడలు, అరుగులు కట్టారు. 
'ఆ అరుగులు ఎంతో సుఖంగా వుండేవి ' అన్నారు భగవాన్ ఒకసారి శ్రీరమణాశ్రమంలో.

ఆ అరుగులపై గడ్డిచాపలు పరచుకుని కూర్చునేవారు. 
స్కందాశ్రమం ఋష్యాశ్రమాల్ని గుర్తు చేసేది. 
నిరంతరం ప్రవహించే ఆ సెలయేరు ఆశ్రమవాసుల అవసరాలు తీర్చడమేకాక, 
తోటలో మొక్కలకు కూడా నీటిని ఇచ్చేది. 
అక్కడ కొత్త జీవివం ఆరంభమైంది.

స్కందాశ్రమం ఏర్పడిన ఆరు మాసాలకు అలఘమ్మ నారాయణ రెడ్డి 
అనే అతన్ని పంపించి మూడో కొడుకు నాగసుందరాన్ని అరుణాచలం రప్పించింది. 
మొదట్లో అతడు గంభీరం శేషయ్యగారి ఇంట్లో వుండేవాడు. 
తర్వాత ఓ సత్రంలో తింటో, తిరిగేవాడు. 
క్రమంగా అతనిలో మార్పు వచ్చింది. 

1918 లో అతడు కాషాయం కట్టి నిరంజనానంద స్వామి అని పేరు మార్చుకున్నాడు. 
భిక్షాన్నంతో జీవించేవాడు. అది చూసి 'ఇక్కడ అలఘమ్మ వంటచేసి పెడితే 
ఇంతమంది తినగా లేనిది, కన్నకొడుకు భిక్షాటన చేసుకుని తినడం ఎందుకు?' 
అని కొందరు అతన్ని స్కందాశ్రమానికి తీసుకొచ్చారు. 

అప్పటి నుంచి అతన్ని అందరూ 'చిన్నస్వామి ' అని పిలిచేవారు.
Monday, March 28, 2022

 || మౌనం ||

వెంకట్రామన్ మాట్లాడకపోతే, స్వామి మౌనవ్రతం పూనారకున్నారు. 
కాని, అసలేం జరిగిందంటే, అంటూ భగవాన్ ఒకసారి ఇట్లా చెప్పారు 

'నేను అరుణాచలేశ్వరాలయంలో వేయి కాళ్ళ మండపంలో ఉన్నప్పుడు, 
ఒక సాధు పక్కన కూర్చున్నాను. ఆయన నాకు భిక్షాన్నం పెట్టేవారు. గుంపుల నుంచీ, వారి ప్రశ్నలనుంచీ తప్పించుకునేందుకు ఆ సాధు మౌనవ్రతం పూనారు. 

ఆ పద్దతి తాత్కాలిక అనుకూల పద్దతిగా తోచి, నేనూ ఆ పద్దతినే అనుకరించాను. 
అంతేకాని నేను మౌనవ్రతం పూనలేదు యేనాడూ. ఊరికే మౌనంగా వుండేవాడిని. అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని '.

మౌనం నిరంతర భాషణ. 
ఆలోచనలు ఆగిన తర్వాత పరస్పర అవగాహన చేసుకోడానికి పనికివచ్చే భాష. 
మౌనం, అది విశ్వజనీనమైన భాష. అది ఆగని వాక్ప్రవాహం. 
మాటలు దానికి అడ్డు కట్టలు. వాక్కులు, అవాంతరాలు. మౌనం, శక్తివంతమైన భాష. 
అంతులేని జనన - మరణాలకు అంతం, మౌనం. అటువంటి మౌనం, మూత్రివంతమైనదే వెంకట్రామన్. అంటే అతనే మౌనం. 

అటువంటి మహర్షి, మౌన బోధ చేస్తారనేది ఉత్త అర్థం లేని సంగతి.
మౌనమంటే, మాట్లడకపోవడం కాదు. 
మనోవృత్తుల విజృంభణల్ని ఆపుజేయడం. మౌనం, ప్రపంచాన్ని నిరాకరించదు. 

కాని, ప్రపంచాన్ని గ్రహిస్తుంది, సహిస్తుంది, భరిస్తుంది, అనుభవిస్తుంది. 
ఆ మౌనమే, సత్యం-శివం-సుందరం. 
అదే ఆనందం, శాంతం. అదే ఆత్మం. అదే మోక్షం.
|| సమాధి స్థితి || 

సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండక చేసుకుని, ఆ రాత్రి వెంకట్రామన్ ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికి వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, వెంకట్రామన్ ఇంటి తలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్లు ఎంత అరచి, పిలిచి, తలుపులు బాదినా,
 అతనికి మెలకువ రాలేదు. చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా, 
అతనికి మెలకువ రాలేదు.

వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. 
అతనితో ఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్ర పోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, అతని ముఖానికి మసి పూసేవారు, ఏం చేసినా,
అతనికి మెలకువ వచ్చేది కాదు.

'ఆ రకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. 
అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది '  అని చెప్పేవారు భగవాన్.

 

భగవాన్ మాత అలఘమ్మ వేడుకోలు | ప్రారబ్ధం |




1898 - క్రిస్మస్ శలవలకు భగవాన్ అన్నగారైన నాగస్వామిని తీసుకుని అలఘమ్మ(మాత) తిరువణ్ణామలై వచ్చింది. వెంకట్రామన్(భగవాన్) గురించి చెప్పినప్పటి నుంచీ ఆమె క్షణం ఒక యుగంగా గడిపింది.

అలఘమ్మ యెంత పలకరించినా భగవాన్ మౌనంగా వుండిపోయినారు.
యెంతో యేడ్చింది.

'బాబూ, వెంకట్రామన్ ఒక్కసారి నా వైపు చూడరా! నేను నీ తల్లినిరా. యెంత మారిపోయావురా. ఎంత చిక్కిపోయావో! అన్నయ్య కూడా వచ్చాడురా ' అని ఒకటే బ్రతిమాలింది.

అలఘమ్మ దీనావస్థ చూసి కొందరు జాలిపడి, 'స్వామీ, మీ అమ్మ వచ్చారు ' అన్నారు. 

స్వామి మౌనంగానే వున్నారు. అలఘమ్మ అభ్యర్థన, రోదన, ప్రాధేయపడటం చూసి, 

కొందరు జాలిపడి, 'స్వామీ, మీ తల్లి ఏడుస్తోంది. ఆమెకు ఓదార్పుగానైనా, కనీసం ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడండి, స్వామీ ఆమెను దయ తలచండి. పోనీ, 'అవును-కాదు ' అని అయినా అనండి ' అని వినయపూర్వకంగా విన్నవించారు, 

స్వావి సమాధానం చెప్పకపోయేటప్పటికి,

'ఆమె తృప్తికోసం ఏదో ఒకటి కాగితం మీద రాయండి ' అని పచ్చయప్ప పిళ్లై స్వామిని అడిగారు.

స్వామి కాగితం, పెన్సిల్ తీసుకుని, 'వారి, వారి ప్రారబ్ద కర్మానుసారం, విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరుగవలసింది, ఎవరెంత అడ్డు పెట్టినా, జరిగే తీరుతుంది - జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇతి సత్యం, కనుక, వూరికే వుండటం మంచిది, ' అని రాశారు.

అదే స్వామి ప్రపంచానికి ఇచ్చిన ప్రథమోపదేశం. ప్రారబ్ద కర్మానుసారం, కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన బాధ్యత, కర్తది కాని, భవంతుడిది కాదు '  అన్నారు ఒకసారి స్వామి, శివప్రకాశం పిళ్లై ప్రశ్నకు సమాధానంగా.


 || భిక్ష ||



బ్రాహ్మణస్వామిగా భిక్షాటనకు వెళ్లిన రోజుల గురించి ఒకసారి మాటల్లో భగవాన్ ఇట్లా చెప్పారు .

'నేను భిక్ష ఎత్తే రోజుల్లో, లోకానికి చక్రవర్తిననిపించేది. 
చేతిలో ఒక మట్టి మూకుడైనా వుండేది కాదు. 
ఎవరి ఇంటి ముందు అయినా ఆగి, చప్పట్లు చరిచేవాడిని. 
వారు ఏదైనా పెడితే, దోసిలిపట్టి, 
అక్కడే తిని చేతులు తలకు తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 
ఒకే ఇంటికి రెండుసార్లు వెళ్ళేవాడిని కాదు. 
తిరువణ్ణామలైలో నేను తిరగని వీధంటూ లేదు. 

నేను ఎప్పుడు భిక్షకు వస్తానా అని కొందరు నా కోసం ఎదురు చూసేవారు. 
కొందరు ఏమన్నా మిగిలితే పెట్టేవారు. 
కొందరు 'నీ కేరా, బలిసి దుక్కలా వున్నావు. ఫో! కూలి పని చేసుకో!' అని కసిరేవారు. 

నేను నవ్వుకుంటో వెళ్లిపోయేవాడిని.

Blessing

Blessing
Bhagavan Memories