భగవాన్ యెంతోసేపు శిలాప్రతిమలాగ కూర్చుండిపోయేవారు.
భగవాన్ ఒక్కోసారి యేదోరాస్తో దీర్ఘాలోచనల్లో పడేవారు.
భగవాన్ యెక్కువగా తమిళంలో మాట్లాడేవారు.
భగవాన్ ప్రతీదీ స్వయంగా చేసి, చూసి అనుభవం పొందే తత్వం కలవారు.
యెవరూ విస్తళ్ళలో మెతుకులు వదలకూడదు.
'What You will get, You shall Lose. Therefore desire Not'
Bhagavan and Maharshi
https://murtymandala.blogspot.com/2011/03/maharshi-mahatma.html
https://www.quora.com/Did-Mahatma-Gandhi-meet-Ramana-Maharshi-at-any-time
|| వెంకట్రామన్ ||
II
|| అక్షర మణమాల ||
పెరుమాళ్ళస్వామి,
స్వామి సేవ చేసుకుంటో ఊళ్ళో ఓ సత్రంలో భోజనం చేసేవారు.
కొన్నాళ్ళకు ఆ సత్రంవారికి ఆయన పద్దతి నచ్చలేదు.
అప్పుడు పెరుమాళ్ళస్వామి, భగవాన్ తో
'భిక్షుక వృత్తి స్వీకరించి, భిక్ష ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతాను.
ఆ సమయంలో పాడుకునేందుకు నాకో పాట రాసి ఇవ్వండి ' అని స్వామిని అర్థించారు.
తత్ఫలితంగా 'అరుణాచలశివ, అరుణాచలశివ,
అరుణాచలశివ, అరుణాచలా!' అనే పల్లవితో స్వామి పాట కట్టారు.
అదే 'అక్షర మణమాల ' .
|| చిన్నస్వామి ||
|| మౌనం ||
భగవాన్ మాత అలఘమ్మ వేడుకోలు | ప్రారబ్ధం |
1898 - క్రిస్మస్ శలవలకు భగవాన్ అన్నగారైన నాగస్వామిని తీసుకుని అలఘమ్మ(మాత) తిరువణ్ణామలై వచ్చింది. వెంకట్రామన్(భగవాన్) గురించి చెప్పినప్పటి నుంచీ ఆమె క్షణం ఒక యుగంగా గడిపింది.
'బాబూ, వెంకట్రామన్ ఒక్కసారి నా వైపు చూడరా! నేను నీ తల్లినిరా. యెంత మారిపోయావురా. ఎంత చిక్కిపోయావో! అన్నయ్య కూడా వచ్చాడురా ' అని ఒకటే బ్రతిమాలింది.
అలఘమ్మ దీనావస్థ చూసి కొందరు జాలిపడి, 'స్వామీ, మీ అమ్మ వచ్చారు ' అన్నారు.
స్వామి మౌనంగానే వున్నారు. అలఘమ్మ అభ్యర్థన, రోదన, ప్రాధేయపడటం చూసి,
కొందరు జాలిపడి, 'స్వామీ, మీ తల్లి ఏడుస్తోంది. ఆమెకు ఓదార్పుగానైనా, కనీసం ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడండి, స్వామీ ఆమెను దయ తలచండి. పోనీ, 'అవును-కాదు ' అని అయినా అనండి ' అని వినయపూర్వకంగా విన్నవించారు,
స్వావి సమాధానం చెప్పకపోయేటప్పటికి,
'ఆమె తృప్తికోసం ఏదో ఒకటి కాగితం మీద రాయండి ' అని పచ్చయప్ప పిళ్లై స్వామిని అడిగారు.
స్వామి కాగితం, పెన్సిల్ తీసుకుని, 'వారి, వారి ప్రారబ్ద కర్మానుసారం, విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరుగవలసింది, ఎవరెంత అడ్డు పెట్టినా, జరిగే తీరుతుంది - జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇతి సత్యం, కనుక, వూరికే వుండటం మంచిది, ' అని రాశారు.
అదే స్వామి ప్రపంచానికి ఇచ్చిన ప్రథమోపదేశం. ప్రారబ్ద కర్మానుసారం, కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన బాధ్యత, కర్తది కాని, భవంతుడిది కాదు ' అన్నారు ఒకసారి స్వామి, శివప్రకాశం పిళ్లై ప్రశ్నకు సమాధానంగా.
|| భిక్ష ||
బ్రాహ్మణస్వామిగా భిక్షాటనకు వెళ్లిన రోజుల గురించి ఒకసారి మాటల్లో భగవాన్ ఇట్లా చెప్పారు .
Copyright © 2009 భగవాన్ స్మృతులు | for any queries please write to dearsridhar@gmail.com