Showing posts with label జంతు పశుపక్ష్యాదులతో భగవాన్. Show all posts
Showing posts with label జంతు పశుపక్ష్యాదులతో భగవాన్. Show all posts

వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి

Saturday, June 6, 2009
ఆశ్రమంలో వుండే యింకో భక్తుడు కృష్ణస్వామి కోతుల్ని ఒక్కటే కొట్టేవాడు ఎప్పుడూ. కోతులు హాలులోకి వచ్చి అల్లరి చేసినా, పళ్ళు ఎత్తుకుపోయినా, ఏమి చేసినా, కొట్టేటప్పుడు కొట్టవద్దనేవారు భగవాన్.

ఒకసారి అతను కోతుల్ని కొడుతూ వుంటే,

'నువ్వు కోతుల్ని కాదు, నన్నుకొడుతున్నావు.
వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి.
ఆ బాధంతా నేను పడుతున్నాను ' అన్నారు భగవాన్.

భగవాన్ ని ఈడ్చి ఒక లెంపకాయ కొట్టింది !

Wednesday, June 3, 2009
భగవాన్ కొండపైన ఉన్నప్పుడు ఆయన భోజనం చేస్తుండగా, ఓ పెద్ద కోతి వచ్చి విస్తరి పక్కన కూచుంది. భగవాన్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ, ఆ కోతిని చూసి ఆ ముద్దని దానికిచ్చేశారు. ఆ కోతి ఆ ముద్దని తినకుండా విస్తట్లో పెట్టేసి భగవాన్ ని యీడ్చి ఒక లెంపకాయ కొట్టింది.

'ఇదేమిటి, నీకే ముందు పెట్టాను కదా! నన్నెందుకు కొట్టావు ?' అని భగవాన్ అడిగారు.
'ఇతను కోతులకు రాజు. ఇతన్ని రాజుని గౌరవించినట్లు గౌరవించాలి ' అని
తనలో తాననుకున్నట్టుగా అని ఆ ప్రకారం అతనికి వేరే విస్తరి వేయించి వడ్డించారు.

అప్పుడు ఆ కోతి సంతోషంగా తిని వెళ్ళిపోయింది.

గిరి ప్రదక్షిణంలో చిరుతపులి

Monday, June 1, 2009
పూర్వం ఒకసారి భక్తులు కొందరు అర్థరాత్రి వెన్నెలలో వేదం చదువుకుంటో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. అడవిలో కొండమీద నుంచి ఒక చిరుతపులి దూకుతూ వచ్చి రోడ్డుమీద వాళ్ళ తోవకు అడ్డంగా నుంచుంది. వాళ్ళు హడిలిపోయినారు. నోట వేదం ఆగిపోయింది. వెనక్కి పరుగెత్తడానికి కాళ్ళు ఆడలేదు. ఆ చిరుతపులి అట్లాగే కొంచెంసేపు నుంచుని వాళ్ళకేసి కాస్సేపు చూసి తన తోవన వెళ్ళిపోయింది. మెల్లిగా నడుచుకొంటూ బతుకుజీవుడా అని వాళ్ళు ప్రదక్షిణం పని ముగించుకుకొని ఆశమానికి వచ్చి భగవాన్ తో చెప్పారు.

'ఎందుకు భయపడి వేదం చదవటం ఆపారు? వాడు ఒక జ్ఞాని.
మీ వేదం విని, ఇంకా దగ్గిరగా వినాలని ఆసక్తితో వచ్చాడు ' అన్నాడు భగవాన్.

దారిలో చిరుతపులి

Thursday, May 28, 2009
ఒకసారి ఒక కుటుంబంతో ఓరుగంటి వెంకటకృష్ణయ్య అనే భక్తుడు రాత్రి గిరి (అరుణాచలం కొండ) ప్రదక్షిణం చేస్తున్నారు. ఈశాన్య మఠం వైపు మలుపు తిరుగుతుండగా మాకు ఓ లారీ ఎదురువచ్చింది. ఆ లారీవాళ్ళు 'జాగ్రత్తగా వెళ్ళండి , చిరుతపులుల అరుపులు వినబడుతో వున్నాయి. ' అన్నారు.

ఏం చెయ్యం? వెనక్కి వెళ్ళమా మళ్ళీ అన్ని మైళ్ళు? అడవిలో ఆగితే, అవి అక్కడికి రావా, మమ్మల్ని పసి గట్టి! తప్పదు ముందుకు పోవాలి. 'రమణా, జయ రమణా ' అని పాడుకుంటో వెళ్ళాం. ఊరు తగిలింది తరువాత చెప్పాడు మాతో వున్న కాలేజి అబ్బాయి, రోడ్డుకు ఇటు ఒక చిరుత, అటు ఒక చిరుత వున్నాయనీ, తాను చూసి కిక్కురు మనకుండా నడిచాననీ.

చిరుతపులితో భగవాన్

Sunday, May 24, 2009
భగవాన్ పచ్చయ్యమ్మ కోయిలలో వుంటూ వుండే రోజుల్లో, ఓ రోజు మద్రాసునుంచి వారి భక్తులు రంగస్వామి అయ్యంగారు వొచ్చారు. మధ్యాన్నం వొంటిగంటకి మండుటెండలో, ఆలయం ఎదురుగా వుండే కొలనులో స్నానానికి వెళ్ళారు. అదంతా అడవి. ఎవరూ లేరు. హాయిగా స్నానం చేస్తున్నారు అయ్యంగారు.

భక్తులతో మాత్లాడుతో వున్న భగవాన్ చప్పున లేచారు.
అక్కడికొక చిరుత పులి వొస్తోంది, దాహం తీర్చుకోవడానికి.
అయ్యంగారు ఇవతల వొడ్డున స్నానం చేస్తున్నారు. చిరుతని చూడలేదు.

'ఇపుడు పోయి కొంచెం ఆగి తరువాత రా,
నిన్ను చూసి అయ్యంగారు భయపదతారు ' అన్నారు భగవాన్.
చిరుతపులి వెళ్ళిపోయింది.

Blessing

Blessing
Bhagavan Memories