Tuesday, April 12, 2022

పశు-పక్ష్యాదులు | నెమళ్ళు, కుక్క







 
'చిరుకరప్పన్ '  అనే ఓ నల్ల కుక్క వుండేది. అది అందరితో స్నేహంగా, 
ప్రేమగా వున్నట్లే, ఆశ్రమానికి వచ్చే ప్రతి కొత్తవారితోనూ 
అంత ప్రేమగా, స్నేహంగా, చనువుగా వుండేది. 

అది ఒకసారి ఆశ్రమానికి కొత్తగా వచ్చిన ఒక చాదస్తపు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళింది. 
అప్పుడు ఆయన జపం చేసుకుంటున్నారు, మడి కట్టుకుని, 
ఆయన దాన్ని భరించలేక కర్రతో కొట్టారు. 
ఆ కుక్క అభిమానంతో వెళ్ళి, మళ్ళా ఆశ్రమానికి తిరిగి రాలేదు.
 దాని మనసు అంతం సున్నితం. 

ఇంకోసారి పలనిస్వామి ఓ కుక్కను కొడితే, 
అది వెళ్ళి కొలనులో పడి ఆత్మహత్య చేసుకుంది. 

శ్రీరమణాశ్రమం ఏర్పడ్డాక భగవాన్ భోజన సమయంలో 
మొదట కుక్కలకు అన్నం పెట్టమనేవారు. 
తర్వాత ఎవరైనా భిక్షకులు వస్తే, వారికి భోజనం పెట్టాలి. 
చివరకు మిగిలింది ఆశ్రమవాసులు తినాలి.

బరోడా మహారాణిగారు శ్రీ రమణాశ్రమానికి రెండు తెల్ల నెమళ్ళు పంపించారు. 
వాటికి పెట్టే మామిడి పళ్ళు సరిగ్గా పండాయో, 
లేదో భగవాన్ స్వయంగా రుచి చూసి, వాటికి పెట్టించేవారు. 
ఒక్క ఆ నెమళ్ళ మీదనే కాదు, ఆయనకు అన్నింటిపైనా 
అంత శ్రధ్దే, ప్రేమే! ఆయన ఆ నెళ్ల అరుపుల్ని అనుకరించి వాటిని పిలిచేవారు.

***

1924 ప్రాంతంలో శ్రీరమణాశ్రమంలో నాలుగు కుక్కలు వుండేవి. 
భగవాన్ చేత్తో తిండి పెడితేనేగాని, అవి తినేవిగావు. వాటిల్లో ఒక దాని పేరు 'కమల ' .
'కమలా, ఈ కొత్తవారిని గిరి ప్రకక్షిణం తీసుకువెళ్ళు ' అని భవాన్ చెపితే, 
అది వారి వెంట తొమ్మిది మైళ్ళూ గిరిప్రదక్షిణం వెళ్ళి గిరి చుట్టూ వున్న 
ఆలయాల్ని, గ్ఫురాల్ని, కొలనుల్ని, మండపాల్ని, తీర్ధాల్నీ 
విగ్రహాల్ని చూపించి తీసుకొచ్చేది.

అది అన్నింటికంటే పెద్ద కుక్క. దాని సంతతే ఆశ్రమంలో వుండేవి. 
అది స్కందాశ్రమానికి చిన్న పిల్లగా వచ్చింది. 
అప్పటి ఆశ్రమవాసులు దాన్ని తరిమెయ్యాలని చూశారు. 
'ఎందుకంటే, అది ఆడకుక్క. ప్రతి సంవత్సరమ పిల్లల్ని పెడుతుంది. 
చికాకు కలిగిస్తుంది ' అనే నెపంతో. కాని, 

అది భగవాన్ని వదిలి పోలేదు. అది అక్కడే స్థిరపడింది. 
ఆశ్రమంలో దాని సంతతే నిలిచింది. 

0 comments:

Blessing

Blessing
Bhagavan Memories