పశు-పక్ష్యాదులు | ఉడతలు
తన చుట్టూ చేరిన యావత్ మానవేతర ప్రాణికోటిని ఉద్దేశించి,
'ఆ రూపాల్లో, ఆ దేహాల్లో వున్న ఆత్మలు యెటువంటివో,
అవి మన సాన్నిహిత్యాన్ని యెందుకు కోరతాయో మనకు తెలియదు.
పరిపూత్రి కాని కర్మను, పూర్తిచేసుకోవడానికి యీ పశుపక్ష్యాదులు
మనని చేరుతున్నాయేమొ! మనకు తెలియదు ' అనేవారు భగవాన్.
భగవాన్ గురుమూత్రంలో ఉన్నప్పుడు పక్షులు,
ఉడతలు ఆయన చుట్టూ తిరిగి, ఆడుకునేవి. కొన్ని
ఆయనకు దగ్గరలో గూళ్లు కట్టుకుని, పిల్లల్ని పెట్టేవి.
అవి ఏ దశల్లో, ఎన్నెన్ని రోజులకు యెటువంటి పరిణామాలు
చెందుతున్నవీ కనిపెట్టి చూసేవారు, భగవాన్. అలా చూడ్డం వినోదం కోసం కాదు.
వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమగా పరిశీలించేవారు.
ఆయన యెప్పుడూ, యే జంతువునూ, యే పక్షిని 'ఇదీ-అదీ' అనలేదు.
'లక్ష్మి ' కి అన్నం పెట్టండి, 'పిల్లలకు తిండి పెట్టారా?' అని పేర్లు పెట్టి అడిగేవారు.
ఒకసారి ఒక ఉడుతపిల్ల గూట్లోంచి కింద పడింది.
దాన్ని తీసి గూట్లో పెట్టారు, భగవాన్. కాస్సేపటికి అది మళ్ళా కింద పడింది.
దాన్ని తీసి మళ్ళా గూట్లో పెట్టారు. అది మళ్లా కింద పడింది.
భగవాన్ మళ్ళా దాన్ని గూట్లో పెట్టారు. అది కింద పడటం,
భగవాన్ దాన్ని తీసి గూట్లో పెట్టడం అదంతా చూసి,
'మనసు విషయ వాసనల వైపు పోతూ వుంటే, దాన్ని స్వస్థానం చేర్చాలి.
మనసూ ఉడత పిల్లంత చంచలం ' అన్నారు భగవాన్.
పిపీలికాది బ్రహ్మపర్యంతం ఒకటిగా చూసే భగవాన్ కి,
గూట్లోంచి ఉడుతపిల్ల కింద పడిందని గొడవపడ్డారంతే,
అది మనం గొడవ పడినట్లు కాదు.
ఆయన సహజ, సంపూర్ణ యెరుకలోంచే గొడవ పడతారు.
అదంతా వారి ప్రేమ.
