భగవాన్ భక్తుడు మహాదేవయ్యర్ ఓ నెల రోజుల నుంచి మద్రాసులో ఎక్కిళ్ళతో బాధపడుతున్నారు. ఆ జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది. బెల్లమూ, శొంటి పొడుం నూరి తింటే ఎక్కిళ్ళు నయమౌతాయని రాయమని, మాధవస్వామి (పరిచారకుడు) వేపు తిరిగి . . . 'తయారు చేసిన మందు మన దగ్గిర వుండాలి కదూ!' అని అడిగారు. మాధవస్వామి ఆ బుడ్డి తీసుకొచ్చాడు.
దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులకి కొంచెం పంచిపెట్టారు.
అది చూసి సుందరేశయ్యర్ అనే భక్తుడు 'ఇంకా ఉత్తరం కూడా ఎందుకు? మహాదేవయ్యర్ కి యీ పాటికి ఎక్కిళ్ళు నయమై వుంటాయి ' అని. ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను. కాని ఆ ఉత్తరం అందకుండానే, మర్నాటికే ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నించి అయ్యర్ గారికి ఎక్కిళ్ళు కట్టాయి అని.
సరిగా అదే సమయానికి భగవాన్ మందు తిన్నది.
దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులకి కొంచెం పంచిపెట్టారు.
అది చూసి సుందరేశయ్యర్ అనే భక్తుడు 'ఇంకా ఉత్తరం కూడా ఎందుకు? మహాదేవయ్యర్ కి యీ పాటికి ఎక్కిళ్ళు నయమై వుంటాయి ' అని. ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను. కాని ఆ ఉత్తరం అందకుండానే, మర్నాటికే ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నించి అయ్యర్ గారికి ఎక్కిళ్ళు కట్టాయి అని.
సరిగా అదే సమయానికి భగవాన్ మందు తిన్నది.
2 comments:
అధ్బుతం..
challa thanks andi....aa ramanaula sandesaanni maa mundu vunchutunnaru.krutaznulam
Post a Comment