రేపల్లె దగ్గిర మూరతోట గ్రామం నించి వొక శవాన్ని పెట్టెలో పెట్టి తీసుకొచ్చారు, ఆశ్రమం గుమ్మంలోకి, ఒకరు రాత్రి ఎనిమిదింటికి. వాళ్ళకి ఒక్కడే కొడుకు. అతని భగవాన్ బతికిస్తారని ఆశ. ఆ తల్లి రాత్రి పదింటివరకు భగవాన్ తో చెప్పుకుంది.
భగవాన్ ఏమీ మాట్లాడలేదు.
వాళ్ళు వూళ్ళోకి వెళ్ళారు. తెల్లారిందాకా చూసినట్టున్నారు. తెల్లారి దహనసంస్కారాలు చేశారు.
తరువాత భగవాన్ అన్నారు, 'విశ్వాసంతో చాలా దూరం వొచ్చారు. కాని ఒకర్ని బతికిస్తే ఇంక యీ బతికించడానికి అంతం వుంటుందా? ' అని.
తరువాత రెండు రోజులున్నారు వాళ్ళు . వెళ్ళేటప్పుడు దుఃఖమంతా మరిచి నవ్వుతో వెళ్ళారు.
0 comments:
Post a Comment